Stocks to Watch : ట్రేడర్స్​ లిస్ట్​లో ఉండాల్సిన నేటి స్టాక్స్​ ఇవే!-here are the stocks to watch in stock market today ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Here Are The Stocks To Watch In Stock Market Today

Stocks to Watch : ట్రేడర్స్​ లిస్ట్​లో ఉండాల్సిన నేటి స్టాక్స్​ ఇవే!

Sharath Chitturi HT Telugu
Jul 22, 2022 08:03 AM IST

Stocks to Watch : స్టాక్​ మార్కెట్​ ట్రేడర్లు.. తమ ట్రేడింగ్​ లిస్ట్​లో పెట్టుకోవాల్సిన స్టాక్స్​ ఇవే.

ట్రేడర్స్​ లిస్ట్​లో ఉండాల్సిన నేటి స్టాక్స్​ ఇవే!
ట్రేడర్స్​ లిస్ట్​లో ఉండాల్సిన నేటి స్టాక్స్​ ఇవే!

Stocks to Watch : దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు.. దేశీయంగా ఉన్న సంస్థల త్రైమాసిక ఫలితాలు.. సానుకూలతలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక ట్రేడర్లు.. శుక్రవారం తమ ట్రేడింగ్​ లిస్ట్​లో పెట్టుకోవాల్సిన స్టాక్స్​ను నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..

ట్రెండింగ్ వార్తలు

  • జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ: త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది జేఎస్​డబ్ల్యూ ఎనర్జీ. నెట్​ ప్రాఫిట్​.. 179శాతం పెరిగి రూ. 560కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో పాట్​ రూ . 201కోట్లుగా ఉంది. కాగా.. రెవెన్యూ మాత్రం 68శాతం వృద్ధి చెంది రూ. 3,115కోట్లకు చేరింది.
  • బయోకాన్​:- తెలంగాణలోని బయోకాన్​ మేన్యూఫ్యాక్చరింగ్​ ప్లాంట్​పై తనిఖీలు నిర్వహించిన యూఎస్​ హెల్త్​ రెగ్యులేటరీ బృందం.. మూడు అబ్జర్వేషన్లను జారీ చేసింది. రానున్న రోజుల్లో వాటిని పరిష్కరిస్తామని బయోకాన్​ వెల్లడించింది. ఔషధాల తయారీ, ప్లాంట్లలో లోపాలు ఉంటే అబ్జర్వేషన్లు ఇస్తారు.
  • ఆర్​బీఎల్​ బ్యాంక్​:- ఆర్​బీఎల్​ కన్సాలిడేటెడ్​ నెట్​ ప్రాఫిట్​ రూ. 208.66కోట్లుగా ఉంది. గతేడాది అదే త్రైమాసికానికి అది రూ. 462.25కోట్లు! పాట్​ రూ. 201.16కోట్లుగా ఉంది.
  • ఐసీఐసీఐ సెక్యూరిటీస్​:- ఐసీఐసీఐ సెక్యూరిటీస్​ నెట్​ ప్రాఫిట్​ 12శాతం పడిపోయి.. రూ. 273కోట్లు వద్ద నిలిచింది. రెవెన్యూ రూ. 795కోట్లుగా ఉంది. ఈక్విటీస్​ నుంచి వచ్చే రెవెన్యూ.. 17శాతం పడిపోయింది.
  • రిలయన్స్​:- ఇటలీకు చెందిన వాలెంటీనో సంస్థతో రిలయన్స్​ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం.. వాలెంటీనో బొటెక్​ను ఢిల్లీలో ఏర్పాటు చేస్తుంది రిలయన్స్​. అనంతరం దానిని ముంబైకు విస్తరిస్తుంది. మహిళల దుస్తుల నుంచి.. అన్ని రకాల బ్రాండ్లు ఆ షోరూమ్స్​లో ఉంటాయి.
  • ఇమానీ:- పెంపుడు జంతువుల సంరక్షణ స్టార్ట్​అప్​ కానిస్​ లూపస్​ సర్వీసెస్​లో 30శాతం వాటాను కొనుగోలు చేసింది ప్రముఖ ఎఫ్​ఎంసీజీ సంస్థ ఇమానీ. 'ఫుల్​ బాల్​ స్టోరీ' బ్రాండ్​ పేరుతో.. దేశవ్యాప్తంగా పెంపుడు జంతువులకు ఆయుర్వేద ఔషధాలు అందిస్తుంది ఆ సంస్థ.
  • ఐడీబీఐ బ్యాంక్​:- ఐడీబీఐ బ్యాంక్​ స్టాండెలోన్​ పాట్​ 25శాతం వృద్ధి చెంది రూ. 756కోట్లకు చేరింది. అసెట్​ క్వాలిటీ, రికవరీలు పెరిగాయి. అదే సమయంలో ప్రొవిజనింగ్​ తగ్గింది. స్టాండెలోన్​ నెట్​ ప్రాఫిట్​ రూ. 603కోట్లుగా ఉంది.
  • ఎన్​డీటీవీ:- ఎన్​డీటీవీ ప్రోమోటర్లు ప్రనయ్​ రాయ్​, రాధిక రాయ్​పై సెబీ వేసిన పెనాల్టీని రూ. 25కోట్ల నుంచి రూ. 5కోట్లకు తగ్గించింది సాట్​(సెక్యూరిటీస్​ అపిలెట్​ ట్రిబ్యునల్​). అప్పులపై జరిగిన ఒప్పందాన్ని బయట పెట్టలేదని ఎన్​డీటీవీపై ఆరోపణలు ఉన్నాయి.
  • ఎన్​సీఎల్​ ఇండియా:- తమిళనాడులో మైనింగ్​, పవర్​ ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు రూ. 14,944.91కోట్ల పెట్టుబడికి బోర్డు ఆమోద ముద్ర వేసింది. బొగ్గుశాఖ పరిధిలోని ఈ సంస్థ.. వివిధ మైనింగ్​, విద్యుత్​ ప్రాజెక్టుల్లో రూ. 43వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

(గమనిక: ఇవి నిపుణుల సూచనలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ట్రేడింగ్​ విషయంలో సొంత ఎనాలసిస్​ ఉండటం ఉత్తమం.)

IPL_Entry_Point

సంబంధిత కథనం