లవర్​తో కలిసి భర్తను దుపట్టాతో చంపిన భార్య- ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని..-haryana crime news youtuber kills husband with lovers help in dumps in drain ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  లవర్​తో కలిసి భర్తను దుపట్టాతో చంపిన భార్య- ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని..

లవర్​తో కలిసి భర్తను దుపట్టాతో చంపిన భార్య- ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు చూశాడని..

Sharath Chitturi HT Telugu

లవర్​తో ఏకాంతంగా గడుపుతున్న ఓ మహిళను, ఆమె భర్త చూశాడు. వారి అసభ్యకర స్థితి చూసి గొడవపడ్డాడు. కోపంతో వారిద్దరు అతడిని చంపేశారు. హరియాణాలో జరిగింది ఈ ఘటన.

హరియాణాలో దారుణం!

హరియాణాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళ- లవర్​తో కలిసి తన భర్తను చంపేసింది. వారిద్దరిని అతను ఏకాంతంగా, అసభ్యకర స్థితితో చూసి, గొడవ పెట్టుకోవడంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టింది.

అసలేం జరిగిందంటే..

హరియాణా హిసార్​ జిల్లాలోని ప్రేమ్​నగర్​లో ఈ ఘటన జరిగింది. 32ఏళ్ల రవీనకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఆమెకు ఇన్​స్టాగ్రామ్​లో రీల్స్​ చేయడం ఇష్టం. ఇతర క్రియేటర్లతో కలిసి ఆమె డ్యాన్స్​ వీడియోలను పోస్ట్​ చేస్తుంటుంది. ఆమెకు ఒక యూట్యూబ్​ ఛానెల్​ కూడా ఉంది.

కాగా 32ఏళ్ల రవీనకు సురేష్​ అనే వ్యక్తి ఇన్​స్టాగ్రామ్​లో పరిచయం అయ్యాడు. ఏడాదిన్నర పాటు ఇద్దరు కలిసి ఇన్​స్టాగ్రామ్​లో కంటెంట్​ క్రియేట్​ చేశారు.

వాస్తవానికి రవీన భర్త ప్రవీణ్​, అతని కుటుంబసభ్యులకు సురేష్​ అంటే ఇష్టం లేదు. అతడికి దూరంగా ఉండాలని చెప్పేవారు. కానీ రవీన మాత్రం సురేష్​తో డ్యాన్స్​లు చేసి, వీడియోలను సోషల్​ మీడియాలో అప్లోడ్​ చేయడం ఆపలేదు.

వీడియోలు అప్లోడ్​ చేయడం ఆమెకు వ్యసనంగా మారింది. భర్తతో గొడవలు జరుగుతున్నా ఆమె పట్టించుకోలేదు. కాగా గత నెల 25న.. రవీన- సురేష్​లు ఒంటరిగా, అసభ్యకర స్థితిలో ఉండటాన్ని ప్రవీణ్​ చూశాడు. ముగ్గురి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ చాలా తీవ్రమైంది. చివరికి.. రవీన తన దుపట్టాను ప్రవీణ్​ గొంతుకు చుట్టింది. సురేష్​ సాయంతో భర్త గొంతు నులిమి, ఊపిరాడనివ్వకుండా చేసి చంపేసింది.

అర్థరాత్రి బండి మీద..

భర్తను చంపిన తర్వాత అతని మృతదేహాన్ని రవీన దాచిపెట్టింది. ప్రవీణ్​ ఎక్కడ? అని అడిగినప్పుడు తనకేమీ తెలియదన్నట్టు ప్రవర్తించింది. ఆ రోజ అర్థరాత్రి.. సురేష్​ బండి మీద వచ్చాడు. రవీన- సురేష్​లు కలిసి ప్రవీణ్​ మృతదేహాన్ని బండి మీద ఎక్కించుకుని 6 కిలోమీటర్లు ప్రయాణించి దిన్నోడ్​ రోడ్​ నాలాలో పడేశారు.

మార్చ్​ 28న కుళ్లిపోయిన ఓ మృతదేహం బయటకు వచ్చింది. అది ఎవరిది? అని తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు సదర్​ పోలీస్​ స్టేషన్​ అధికారులు. ఆ మృతదేహం ప్రవీణ్​దే అని, అతను కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయాడని తెలుసుకున్నారు. సీసీటీవీ ఫుటేజ్​ పరిశీలించగా రవీన, సురేష్​లు దొరికిపోయారు. అర్థరాత్రి హెల్మెట్​ వేసుకున్న ఓ వ్యక్తి, ఓ మహిళ మధ్యలో మరొకరు ఉన్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. రెండు గంటల తర్వాత రవీన, ఏమీ జరగనట్టు అదే బండి మీద ఇంటికి తిరిగివెళ్లిపోయిన దృశ్యాలు సైతం సీసీటీవీలో కనిపించాయి.

రవీన- సురేష్​లను పోలీసులు అరెస్ట్​ చేసి విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. తమ గురించి తెలిసిపోయి, ప్రవీణ్​ గొడవపెట్టుకోవడంతో అతడిని చంపేసినట్టు రవీన తెలిపింది.

రవీన- సురేష్​లను పోలీసులు జైలుకు తరలించారు. తల్లిదండ్రులు దూరమవ్వడంతో రవీన- ప్రవీణ్​ 6ఏళ్ల కుమారుడు ఇప్పుడు అతని తాత, మామ దగ్గర జీవిస్తున్నాడు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.