దారుణం! 35ఏళ్ల మహిళ గ్యాంగ్​ రేప్​, ఆమె కూతురి హత్య- నిందితుల్లో 13ఏళ్ల బాలుడు-haryana crime news 13 year old among 4 arrested for gang rape murder ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  దారుణం! 35ఏళ్ల మహిళ గ్యాంగ్​ రేప్​, ఆమె కూతురి హత్య- నిందితుల్లో 13ఏళ్ల బాలుడు

దారుణం! 35ఏళ్ల మహిళ గ్యాంగ్​ రేప్​, ఆమె కూతురి హత్య- నిందితుల్లో 13ఏళ్ల బాలుడు

Sharath Chitturi HT Telugu

ఓ 35ఏళ్ల మహిళ, ఆమె 5ఏళ్ల కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగింది. అనంతరం నిందితులు 5ఏళ్ల చిన్నారినిచ చంపేశారు. హరియాణాలో జరిగిన ఈ దారుణ ఘటన నిందితుల్లో ఒక 13ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు.

హరియాణాలో దారుణం

హరియాణాలో అత్యంత దారుణ, అమానవీయ ఘటన జరిగింది. ఓ 35ఏళ్ల మహిళ, ఆమె 5ఏళ్ల కూతురిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 5ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఒక 13ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు!

ఇదీ జరిగింది..

హరియాణా జింద్​లో ఏప్రిల్​ 22 రాత్రి ఈ ఘటన జరిగింది. ముగ్గురు నిందితులు ఓ 5ఏళ్ల చిన్నారిని హత్య చేశారని, ఆ తర్వాత ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసు ప్రతినిధి అమిత్ ఖరాబ్ తెలిపారు.

మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె ఐదేళ్ల కుమార్తె హత్య కేసులో ముగ్గురు పెద్దలు, ఒక మైనర్​ని జింద్ పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడు హత్యలో మాత్రమే పాల్గొన్నాడని, అతడిని సేఫ్​ హౌజ్​కి తరలించామని, ముగ్గురు పెద్దలను పోలీసు కస్టడీకి తీసుకున్నామని అధికారులు వివరించారు.

నిందితుల పేర్లు.. హమీద్ ఖాన్ (46), బీరు (18), శివ (18). మైనర్​ కాబట్టి13 ఏళ్ల బాలుడి వివరాలను వెల్లడించకూడదు.

ఏప్రిల్ 26న సోనేపట్​లో బాధితులకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది.

అనంతరం ముగ్గురు నిందితులు నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.

గతంలో ఆమె భర్తతో జరిగిన గొడవలో మహిళ తనపై పరుష పదజాలం ఉపయోగించడంతోనే ఆమె కూతురిని హత్య చేశానని హమీద్ అంగీకరించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు.

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఏప్రిల్ 22న ఆమె భర్తకు పక్కింటి వ్యక్తికి వాగ్వాదానికి జరిగింది. అది గొడవగా మారి, శారీరక దాడికి దారితీసింది. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయగా, వారు వచ్చి సమస్యను పరిష్కరించారు. మధ్యవర్తిత్వం తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. కానీ పొరుగింటి వ్యక్తితో పాటు మరో ముగ్గురు మళ్లీ బాధితురాలి ఇంటికి వెళ్లారు. ఆమె కుమార్తెను అపహరించి తాడుతో గొంతు నులిమి చంపేశారు. అనంతరం మృతదేహాన్ని చెత్తబుట్టలో పడేశారు. ఆ తర్వాత మళ్లీ ఇంటికి వెళ్లిన నిందితులు (మైనర్​ కాకుండా) మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అదే చెత్తబుట్ట దగ్గర పడేసి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

ఏప్రిల్ 24న బాలిక మృతదేహాన్ని కుటుంబ సభ్యులు పూడ్చిపెట్టారు. బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి శవపరీక్ష కోసం ఆసుపత్రికి తరలించారు.

"నిందితులపై ఏప్రిల్ 24న సామూహిక అత్యాచారం, హత్య అభియోగాలు మోపారు. ఆ తర్వాత ఏప్రిల్ 27న లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్లను ఈ కేసులో చేర్చారు" అని ఓ అధికారి తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.