Bus Accident : లోయలో పడిన బస్సు- ఐదుగురు దుర్మరణం!-gujarat bus accident today five pilgrims travelling to dwarka killed as bus falls into gorge several injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bus Accident : లోయలో పడిన బస్సు- ఐదుగురు దుర్మరణం!

Bus Accident : లోయలో పడిన బస్సు- ఐదుగురు దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Feb 02, 2025 10:58 AM IST

Bus accident: గుజరాత్​లో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది! యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు హైవే మీద నుంచి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

లోయలో పడిన బస్సు,,
లోయలో పడిన బస్సు,,

గుజరాత్​లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యాత్రికులతో వెళుతున్న ఓ బస్సు.. డాంగ్​ జిల్లాలో నాసిక్​- గుజరాత్​ హైవే మీద నుంచి పక్కనే ఉన్న 35 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారని తెలుస్తోంది. 17మంది తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.

yearly horoscope entry point

ఇదీ జరిగింది..

గుజరాత్​లోని సపుతారా హిల్​ స్టేషన్​కి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తొలుత బస్సు నియంత్రణ కోల్పోయి, రోడ్డు పక్కనే ఉండే క్రాష్​ బేరియర్​ని ఢీకొట్టింది. అనంతరం పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.

బస్సు మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ నుంచి గుజరాత్​లోని ద్వారకాకు యాత్రికులతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి పరుగులు తీసి సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

బస్సు లోయలో పడిన సమయంలో వాహనంలో 48మంది యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోందని సపుతార హిల్​ స్టేషన్​ ఎస్పీ ఎస్​.జీ పాటిల్​ తెలిపారు.

"ఈ ఘటనలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మృతి చెందారు. మొత్తం మీద ఐదుగురు యాత్రికులు మృతి చెందగా, మరో 17 మందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని అహ్వాలోని సివిల్ ఆస్పత్రికి తరలించారు. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. రెస్క్యూ ఆపరేషన్ దాదాపు పూర్తయింది," అని అధికారులు తెలిపారు.

యాత్రికులు మధ్యప్రదేశ్​లోని గుణ, శివపురి, అశోక్ నగర్ జిల్లాలకు చెందినవారని అధికారులు గుర్తించారు.

ఎస్​యూవీ బోల్తా- ఐదుగురు మృతి!

దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ ఎస్​యూవీ బోల్తాపడటంతో అందులోని ఐదుగురు మరణించిన ఘటన బిహార్​లో తాజాగా చోటుచేసుకుంది. మృతులు నేపాల్​కి చెందిన వారు. మహా కుంభమేళా 2025 నుంచి తిరిగొస్తున్న సమయంలో, రోడ్డు మీద స్టంట్స్​ చేస్తున్న బైక్​ని తప్పించుకోబోయే క్రమంలో వాహనం బోల్తా కొట్టింది.

బిహార్​ ముజాఫర్​పూర్​ జిల్లాలోని మధుబాని 4-లేన్​ బైపాస్​లో శనివారం ఈ ఘటన జరిగింది. స్కార్పోయో ఎస్​యూవీ రోడ్డు మీద వెళుతుండగా.. డ్రైవర్​కి ఎదురుగా స్టంట్స్​ చేస్తున్న బైకర్​ కనిపించాడు. అతడి నుంచి తప్పించుకోబోయే క్రమంలో ఈ ఎస్​యూవీ తొలుత డివైడర్​ని ఢీకొట్టింది. అనంతరం గాల్లో ఐదుసార్లు పల్టీ కొట్టి, చివరికి నేల మీద క్రాష్​ అయ్యింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు అయ్యింది. విండోలు విరిగిపోయాయి. కారుకు చెందిన ఒక టైరు విరిగి, కేబిన్​లోపల ఉన్న ప్రయాణికులను ఢీకొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో కారులో మొత్తం 9మంది ఉన్నారు. ఎయిర్​బ్యాగ్స్​ ఓపెన్​ అవ్వకపోవడంతో, ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు, మిగిలిన వారు గాయపడ్డారు. వీరిలో పలువురు ఆరోగ్యం విషమంగా ఉంది. వీరందరు నేపాల్​కి చెందిన వారు అని పోలీసులు గుర్తించారు. వారి కుటుంబసభ్యులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నట్టు వివరించారు.

కారు గాల్లో పల్టీ కొడుతుండటాన్ని చూసిన బైకర్లు.. భయంతో వెంటనే అక్కడి నుంచి పారిపోయారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.