Bengal train accident : పశ్చిమ్​ బెంగాల్​లో ఘోర రైలు ప్రమాదం.. ఎక్స్​ప్రెస్​ని ఢీకొట్టిన గూడ్స్​!-goods train rams into kanchenjunga express in west bengal several injured ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengal Train Accident : పశ్చిమ్​ బెంగాల్​లో ఘోర రైలు ప్రమాదం.. ఎక్స్​ప్రెస్​ని ఢీకొట్టిన గూడ్స్​!

Bengal train accident : పశ్చిమ్​ బెంగాల్​లో ఘోర రైలు ప్రమాదం.. ఎక్స్​ప్రెస్​ని ఢీకొట్టిన గూడ్స్​!

Sharath Chitturi HT Telugu
Jun 17, 2024 11:09 AM IST

Bengal train accident : పశ్చిమ్​ బెంగాల్​లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కాంచన్​జంగ ఎక్స్​ప్రెస్​ని ఓ గూడ్స్​ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు.

రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం..
రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం..

West Bengal train accident : పశ్చిమ్​ బెంగాల్​లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. న్యూ జల్​పైగురి ప్రాంతంలో సోమవారం ఉదయం.. కాంచన్​జంగ ఎక్స్​ప్రెస్​ని ఓ గూడ్స్​ రైలు బలంగా ఢీకొట్టింది. ఫలితంగా.. రెండు రైళ్లకు చెందిన పలు బోగీలు పట్టాలు తప్పాయి.

yearly horoscope entry point

పశ్చిమ్​ బెంగాల్​ రైలు ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించారని అధికారులు వెల్లడించారు. మరో 25 నుంచి 30మందికి గాయాలైనట్టు తెలిపారు.

ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. గూడ్స్​ రైలు సిగ్నల్​ని అతిక్రమించి, కాంచన్​జంగ ఎక్స్​ప్రెస్​ని ఢీకొట్టినట్టు తెలుస్తోందని అధికారులు వెల్లడించారు.

ఈ ఘటనపై పశ్చిమ్​ బెంగాల్​ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. యుద్ధప్రాదిపతికన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించినట్టు స్పష్టం చేశారు.

Kanchenjunga Express accident today : “డార్జిలింగ్​​ జిల్లా ఫాన్సిదేవా ప్రాంతంలో జరిగిన రైలు ప్రమాదం వార్త విని షాక్​ అయ్యాను. కాంచన్​జంగ ఎక్స్​ప్రెస్​ని ఓ గూడ్స్​ రైలు ఢీకొట్టినట్టు తెలుస్తోంది. జిల్లా మెజిస్ట్రేట్​, ఎస్​పీ, వైద్యులు, అంబులెన్స్​లు ఘటన స్థలానికి వెళ్లాయి,” అని ఎక్స్​లో ట్వీట్​ చేశారు మమతా బెనర్జీ.

మీడియా కథనాల ప్రకారం.. కాంచన్​జంగ ఎక్స్​ప్రెస్​ని గూడ్స్​ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఫలితంగా ఎక్స్​ప్రెస్​కి చెందిన రెండు బోగీలు డీరైల్​ అయ్యాయి.

త్రిపురలోని అగర్తల నుంచి కోల్​కతాలోని సీల్దా స్టేషన్​కి వెళ్లాల్సిన కాంచన్​జంగ ఎక్స్​ప్రెస్​ ఇది. కానీ ఉదయం 8 గంటల సమయంలో గూడ్స్​ రైలు.. ఎక్స్​ప్రెస్​ని ఢీకొట్టడంతో పశ్చిమ్​ బెంగాల్​ రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటనాస్థలం నుంచి విషాదకర దృశ్యాలు వెలువడుతున్నాయి. గూడ్స్​ రైలుకు చెందిన అనేక బోగీలు పట్టాలు తప్పాయి. వాటి మీద నుంచి.. ఎక్స్​ప్రెస్​కి చెందిన ఒక బోగీ గాలిలోకి ఎగిరి ఉండిపోయింది. వాటిని చూసేందుకు స్థానికులు భార సంఖ్యలో గుమిగూడారు.

పశ్చిమ్​ బెంగాల్​ రైలు ప్రమాదంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విణి వైష్ణవ్​ స్పందించారు.

“ఎన్​ఎఫ్​ఆర్​ జోన్​లో దిగ్భ్రాంతికర ఘటన జరిగింది. యుద్ధప్రాదిపతికన చర్యలు చేపడుతున్నాము. రైల్వే, ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు కలసిగట్టుగా పనిచేస్తున్నాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సీనియర్​ అధికారులు ఘటనాస్థలానికి వెళ్లారు,” అని అశ్విణి వైష్ణవ్​ వెల్లడించారు.

Train accident today : దేశంలో ఇటీవలి కాలంలో రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతంది. గత అక్టోబర్​లో ఆంధ్రప్రదేశ్​లో రైలు ప్రమాదం జరిగింది. ఇక గతేడాది జూన్​లో జరిగిన ఒడిశా రైలు ప్రమాదం.. యావత్​ దేశాన్ని షాక్​కు గురిచేసింది. నాడు.. బహనాగా రైల్వే స్టేషన్​లో కోరమండల్​ ఎక్స్​ప్రెస్​.. గూడ్స్​ రైలును ఢీకొట్టింది. కొన్ని బోగీలు.. అదే సమయంలో అటువైపు వెళుతున్న బెంగళూరు హౌరా ఎక్స్​ప్రెస్​ మీద పడ్డాయి. ఈ ఘటనలో 290కిపైగా మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 1200 మంది గాయపడ్డారు.

Whats_app_banner

సంబంధిత కథనం