Gold rates today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇవే!-gold rates today in telugu 23rd september 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gold Rates Today In Telugu 23rd September 2022

Gold rates today : పెరిగిన బంగారం, వెండి ధరలు.. నేటి లెక్కలు ఇవే!

Sharath Chitturi HT Telugu
Sep 23, 2022 06:03 AM IST

Gold rates today : దేశంలో పసిడి, వెండి ధరలు శుక్రవారం పెరిగాయి. ఆ లెక్కలు ఇలా ఉన్నాయి.

నేటి బంగారం ధరల లెక్కలు
నేటి బంగారం ధరల లెక్కలు (Saikat Paul)

Gold rates today : దేశంలో బంగారం ధరలు శుక్రవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 200 పెరిగి.. రూ. 46,000కి చేరింది. గురువారం ఈ ధర రూ. 45,800గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 2000 పెరిగి, రూ. 4,60,000కి చేరింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 240 వృద్ధిచెంది.. రూ. 50,200కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 59,960గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 2,400 పెరిగి.. రూ. 5,02,000గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం కాస్త పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,350గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,200గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,750గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 51,000గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,030గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,230గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,260గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,050గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,240గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,200గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు కూగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,800గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 600 పెరిగి.. 58,000కి చేరింది. గురువారం ఈ ధర రూ. 57,400గా ఉండేది.

Silver rates Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 63,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 58,000.. బెంగళూరులో రూ. 63,000గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు గురువారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 150 పెరిగి.. రూ 23,730కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,580గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,730గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

IPL_Entry_Point

సంబంధిత కథనం