Today gold rates : పసిడి ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన బంగారం ధర!-gold rates today 24 september 2022 check details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gold Rates Today 24 September 2022 Check Details

Today gold rates : పసిడి ప్రియులకు షాక్​.. భారీగా పెరిగిన బంగారం ధర!

Sharath Chitturi HT Telugu
Sep 24, 2022 06:12 AM IST

Gold rates today : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆ వివరాలు..

మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు..
మీ నగరాల్లో నేటి బంగారం ధరల వివరాలు.. (REUTERS)

Gold rates today in telugu : దేశంలో బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 500 పెరిగి.. రూ. 46,500కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 5000 పెరిగి, రూ. 4,65,000కి చేరింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 530 వృద్ధిచెంది.. రూ. 50,703కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,200గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 5,300 పెరిగి.. రూ. 5,07,300గా ఉంది.

Today gold rates : మీ నగరాల్లో బంగారం ధరలు ఇలా..

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 50,730గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,950ను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 46,530గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,760గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,780గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు భారీగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,680గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1200 తగ్గి.. 56,800కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 58,000గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 62,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 56,800.. బెంగళూరులో రూ. 62,500గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 100 పెరిగి.. రూ 23,420కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,320గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

IPL_Entry_Point

సంబంధిత కథనం