Today gold rates : పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధర!
Gold rates today : దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. వెండి ధరలు భారీగా తగ్గాయి. ఆ వివరాలు..
Gold rates today in telugu : దేశంలో బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 500 పెరిగి.. రూ. 46,500కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,000గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ. 5000 పెరిగి, రూ. 4,65,000కి చేరింది.
ట్రెండింగ్ వార్తలు
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 530 వృద్ధిచెంది.. రూ. 50,703కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,200గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 5,300 పెరిగి.. రూ. 5,07,300గా ఉంది.
Today gold rates : మీ నగరాల్లో బంగారం ధరలు ఇలా..
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం భారీగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,600గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,890గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 46,500 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 50,730గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,700గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,950ను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 46,530గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 50,760గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,500గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 46,550గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,780గాను కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 46,500గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,730గా ఉంది.
ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు భారీగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,680గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 1200 తగ్గి.. 56,800కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 58,000గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 62,500 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 56,800.. బెంగళూరులో రూ. 62,500గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 100 పెరిగి.. రూ 23,420కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,320గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,420గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)
సంబంధిత కథనం