Today Gold rates : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!-gold rates in telugu on saturday 17 september 2022 ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Gold Rates In Telugu On Saturday 17 September 2022

Today Gold rates : దిగొచ్చిన పసిడి, వెండి ధరలు.. నేటి లెక్కలివే!

Sharath Chitturi HT Telugu
Sep 17, 2022 06:21 AM IST

Gold rates : దేశంలో పసిడి, వెండి ధరలు శనివారం దిగొచ్చాయి. ఆ లెక్కలు..

దిగొచ్చిన పసిడి వెండి ధరలు.. నేటి లెక్కలివే
దిగొచ్చిన పసిడి వెండి ధరలు.. నేటి లెక్కలివే (Amit Sharma)

Gold rates : దేశంలో బంగారం ధరలు శనివారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 తగ్గి.. రూ. 45,800కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 46,200గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 4000 దిగొచ్చి, రూ. 4,58,000కి చేరింది.

CTA icon
మీ నగరంలో ఈరోజు బంగారం ధర తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 440 తగ్గి.. రూ. 49,960కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 50,400గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర ఏకంగా రూ. 4,400 దిగొచ్చి.. రూ. 4,99,600గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం దిగొచ్చాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 45,950గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 50,120గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 45,800 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 49,960గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 46,260గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 50,460గాను ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 45,830గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 49,980గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 45,800గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,960గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 45,850గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 50,020గాను కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 45,800గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 49,960గా ఉంది.

ద్రవ్యోల్బణం, రష్యా ఉక్రెయిన్​ యుద్ధం, ఫెడ్​ వడ్డీ రేట్ల పెంపు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

దేశంలో వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 5,640గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 600 దిగొచ్చి.. 56,400కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 57,000గా ఉండేది.

Silver rates in Hyderabad : కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 61,600 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 56,400.. బెంగళూరులో రూ. 61,600గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు శుక్రవారం తగ్గాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 130 తగ్గి.. రూ 23,130కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,260గా ఉండేది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 23,130గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

IPL_Entry_Point

సంబంధిత కథనం