పనాజీ: గోవా పోలీసులు ఉత్తర గోవాలోని కాండోలిమ్ ప్రాంతంలో గొడవ చేసినందుకు ముంబై వ్యాపారి అబు ఫర్హాన్ అజ్మీ, ఇద్దరు గోవా వాసులపై కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. విలాసవంతమైన ఎస్యూవీని నడుపుతున్న ఫర్హాన్ అజ్మీని కాండోలిమ్ ప్రాంతంలో కొంతమంది స్థానికులు ఆపి, అతివేగంగా వాహనం నడుపుతున్నారని నిందించారు.
ఫర్హాన్ అజ్మీ తండ్రి అబు అజ్మీ ముంబై మంఖుర్ద్ షివాజీనగర్ నుండి నాలుగు సార్లు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ఎమ్మెల్యే. ఫర్హాన్ పోలీసులకు ఫోన్ చేసి స్థానికులను వెనక్కి తగ్గాలని హెచ్చరించాడు. తనకు రక్షణ కోసం లైసెన్స్ ఉన్న ఆయుధం ఉందని చెప్పాడు.
ఈ ఘటన మొత్తం పర్యాటకులకు ప్రసిద్ధి చెందిన గోవా తీరప్రాంతంలో ప్రధాన రహదారి వెంట గందరగోళానికి దారితీసింది. ఈ నేపథ్యంలో పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందింది.
“పోలీసులు వచ్చినప్పుడు, స్థానికులు డ్రైవర్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లడానికి అనుమతించలేదు. చివరకు, ఈ గొడవలో పాల్గొన్న ఇరువర్గాలను స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. వారు ఫిర్యాదులు దాఖలు చేసే అవకాశం ఇచ్చారు. కానీ ఇరువర్గాలు నిరాకరించాయి.” అని నార్త్ గోవా పోలీస్ అధికారి కౌశల్ చెప్పారు.
“సంబంధిత వ్యక్తులు పబ్లిక్ ప్లేస్లో గొడవ పడి, శాంతి భద్రతలకు భంగం చేసి, గొడవ చేస్తున్నందున, స్థానిక స్టేషన్ హౌజ్ అధికారి ఫిర్యాదును దాఖలు చేశారు,” అని ఆయన వివరించారు.
అజ్మీతో పాటు, పోలీసులు మరో ఇద్దరు స్థానికులు జియోన్ ఫెర్నాండెస్, జోసెఫ్ ఫెర్నాండెస్లపై కేసు నమోదు చేశారు. విచారణలో సహకరించాలని ముగ్గురికీ నోటీసులు జారీ చేశారు.
సంబంధిత కథనం
టాపిక్