అప్పులు తీర్చలేక.. ఆడబిడ్డలను అమ్ముకుంటున్న తండ్రులు!-girls sold women raped to settle disputes in rajasthan report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  అప్పులు తీర్చలేక.. ఆడబిడ్డలను అమ్ముకుంటున్న తండ్రులు!

అప్పులు తీర్చలేక.. ఆడబిడ్డలను అమ్ముకుంటున్న తండ్రులు!

Rajasthan crime news : అప్పులు తీర్చుకోలేకపోతున్న కొందరు తండ్రులు.. కుల పంచాయతీ పెద్దల ఆదేశాలతో.. తమ ఆడబిడ్డలను అమ్ముకుంటున్నారు! ఇలాంటి ఘటనలు నిత్యం రాజస్థాన్​లో వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాకుండా.. కుంటుంబంలోని మహిళలు కూడా అత్యాచారానికి గురవుతున్నారు.

అప్పు తీర్చలేక.. ఆడబిడ్డలను అమ్ముకుంటున్న తండ్రులు!

Rajasthan father sold daughter : రాజస్థాన్​లో అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పులు తీర్చలేకపోతుండటంతో.. ఇంటి ఆడబిడ్డలను కుటుంబాలు అమ్ముకోవాల్సి వస్తోంది. అంతేకాకుండా.. కుటుంబంలోని మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు. కుల పంచాయతీ పెద్దల ఆదేశాలతో ఇవన్నీ జరుగుతున్నాయి!

అమానవీయ ఘటన..

రాజస్థాన్​లో ఇలాంటి ఘటనలు అనాదిగా జరుగుతూనే ఉన్నాయి! తాజాగా.. ఓ వ్యక్తి అప్పు తీర్చలేకపోవడంతో.. తన 8ఏళ్ల ఆడబిడ్డను అమ్ముకున్నాడని ఓ జాతీయ మీడియా కథనం ప్రచురించింది. స్టాంప్​ పేపర్ల మీద అధికారిక ఒప్పందాలు చేసుకుని మరీ అమ్మకాలు జరుపుతుండటం గమనార్హం.

Rajasthan caste councils : రాజస్థాన్​లో ఇప్పటికీ కాస్ట్​ కౌన్సిల్స్​(కుల పంచాయతీ)లు ఉన్నాయి. ఏదైనా సమస్యను పరిష్కరించుకోవడం కోసం సాధారణంగా పోలీసులు వద్దకు వెళుతూ ఉంటారు. కానీ రాజస్థాన్​లోని అనేక గ్రామాల ప్రజలు పోలీసుల వద్దకు కాకుండా.. ఇలా కాస్ట్​ కౌన్సిల్స్​ వద్దకు వెళతారు. ఈ నేపథ్యంలో పంచాయతీ పెద్దలు.. ఆడబిడ్డల అమ్మకాలు, మహిళలపై అత్యాచారాలు వంటి తీర్పులు ఇస్తున్నారు!

రూ. 15లక్షల అప్పు తీర్చలేకపోతున్న ఓ వ్యక్తి కేసు.. ఇటీవలే కుల పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లింది. ఈ క్రమంలోనే అతి 12ఏళ్ల ఆడబిడ్డను అమ్మాలని తీర్పునిచ్చారు ఆ పెద్దలు.

Rajasthan crime news : మరో ఘటనలో ఓ బాలికను రూ. 6లక్షలకు ఆ తండ్రి అమ్ముకోవాల్సి వచ్చింది. అలా.. ఆ బాలిక ఇప్పటికే మూడుసార్లు చేతులు మారింది! అంతేకాకుండా నాలుగుసార్లు గర్భం కూడా దాల్చింది. ఆ బాలికతో పాటు.. తన ఇంటిని కూడా అమ్ముకుని ఆ తండ్రి రూ. 6లక్షల అప్పును తీర్చుకోవాల్సి వచ్చింది. అనారోగ్యంతో ఉన్న భార్యకు చికిత్స కోసం అప్పు చేశాడు ఆ వ్యక్తి. అప్పు తీసుకుని వైద్యం ఇప్పించినా.. ఆ మహిళ ప్రాణాలు దక్కలేదు. చివరికి.. అప్పు తీర్చలేకే.. అడబిడ్డను కూడా అమ్మేసుకున్నాడు.

ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు..

జాతీయ మీడియాలో వచ్చిన కథనంపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్​హెచ్​ఆర్​సీ) స్పందించింది. ఇలా వేలం పాటలో కొనుగోలు చేస్తున్న బాలికలను విదేశాలకు ట్రాఫికింగ్​ చేస్తున్నారని పేర్కొంది. లైంగికంగా హింసిస్తున్నారని, బానిసత్వంలోకి నెడుతున్నారని వివరించింది.

Father sells daughter to clear debt : మీడియాలో వచ్చిన కథలు నిజమైతే.. మానవ హక్కులకు తీవ్ర భంగం వాటిల్లినట్టేనని ఎన్​హెచ్​ఆర్​సీ వివరించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్​ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకన్నారో వివరిస్తూ నివేదికను నాలుగు వారాల్లో అందించాలని రాజస్థాన్​ చీఫ్​ సెక్రటరీని ఆదేశించింది.

తాజా పరిణామాలపై రాజస్థాన్​ పోలీసులకు కూడా నోటీసులు జారీ చేసింది ఎన్​హెచ్​ఆర్​సీ. నిందితులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ నివేదికను అందించాలని స్పష్టం చేసింది. ఘటనలను నిలువరించడంలో అశ్రద్ధ వహించిన అధికారులపై ఎలాంటి చర్యలు చేపట్టారో కూడా వివరించాలని పేర్కొంది.

క్షేత్రస్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ఎన్​హెచ్​ఆర్​సీ రంగంలోకి దిగింది. రాజస్థాన్​లో పర్యటించి.. అక్కడి పరిస్థితులపై మూడు నెలల్లో నివేదికను అందించాలని ఓ అధికారికి చెప్పింది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.