UP crime news : ప్రియుడితో కలిసి భర్తను 'పాతేసిన' భార్య.. నాలుగేళ్ల తర్వాత!-ghaziabad man shot and buried 7 feet deep by wife her lover body found 4 years later ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Ghaziabad Man Shot And Buried 7 Feet Deep By Wife, Her Lover. Body Found 4 Years Later

UP crime news : ప్రియుడితో కలిసి భర్తను 'పాతేసిన' భార్య.. నాలుగేళ్ల తర్వాత!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 15, 2022 07:00 AM IST

Woman kills husband with lover : ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ భార్య. అంతేకాకుండా.. ప్రియుడి ఇంట్లో గొయ్యి తవ్వి, భర్త మృతదేహాన్ని అందులో పాతేసింది. నాలుగేళ్ల తర్వాత.. మృతదేహం పోలీసులకు లభించింది. ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది ఈ ఘటన.

ప్రియుడితో కలిసి భర్తను 'పాతేసిన' భార్య.. నాలుగేళ్ల తర్వాత!
ప్రియుడితో కలిసి భర్తను 'పాతేసిన' భార్య.. నాలుగేళ్ల తర్వాత!

Woman kills husband with lover : ఉత్తర్​ప్రదేశ్​ ఘజియాబాద్​లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. ప్రియుడితో కలిసి తన భర్తను హత్య చేసింది. మరణించిన వ్యక్తి మృతదేహం.. నాలుగేళ్ల తర్వాత పోలీసులకు దొరికింది!

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది..?

2018 నాటి ఘటన ఇది. సవిత అనే మహిళకు చంద్రవీర్​ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. తన కుటుంబంతో కలిసి ఘజియాబాద్​లో నివాసముంటోంది. అదే సమయంలో పక్కింట్లో ఉండే అరుణ్​తో ఆమె అక్రమ సంబంధాన్ని కొనసాగించింది. భర్తను వదిలించుకోవాలని భావించింది సవిత. ఈ క్రమంలోనే అరుణ్​ కలిసి.. భర్తను చంపేందుకు ప్రణాళికలు రచించింది. వారిద్దరు సమయం కోసం ఎదురుచూశారు.

ఈలోగా.. అరుణ్​.. తన ఇంట్లో ఓ 6,7 అడుగుల గొయ్యి తవ్వాడు. సమయం చూసుకుని ఇద్దరు.. చంద్రవీర్​ను హత్య చేశారు. ఆ తర్వాత.. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా, ఎవరికీ అనుమానం రాకుండా తవ్విన గొయ్యిలో పడేశారు. ఆ వెంటనే.. సిమెంట్​ ఫ్లోరింగ్​తో గొయ్యిని కప్పేశారు. అప్పటి నుంచి అరుణ్​ అదే చోట నివాసముంటున్నాడు!

Uttar Pradesh crime news : మరోవైపు.. ఈ వ్యవహారంలో పోలీసులకు దొరకకుండా ఉండేందుకు మరో ప్రణాళిక రచించింది సవిత. తన భర్త కనిపించడం లేదని కిడ్నాప్​ కేసు వేసింది. మరిదిపై అనుమానాలు ఉన్నట్టు, అతనే తన భర్తను చంపేసినట్టు ఆరోపణలు చేసింది. రోజులు గడిచాయి.. కానీ పోలీసులు ఈ కేసులో పురోగతి సాధించలేకపోయారు. కాలంతో పాటు ఈ కేసు పక్కకు పడిపోయింది.

4ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మర్డర్​ మిస్టరీని పరిష్కరించినట్టు పోలీసులు ప్రకటించారు. అరుణ్​ ఇంటికి వెళ్లి.. ఆ గొయ్యి తవ్వి, చంద్రవీర్​ అస్తికలను బయటకు తీశారు. కేసుకు సంబంధించి.. సవిత, ఆమె ప్రియుడు అరుణ్​లను సోమవారం అరెస్ట్​ చేశారు.

"కేసుకు సంబంధించి.. క్రైమ్​ బ్రాంచ్​కు ఇటీవలే కొన్ని క్లూలు దొరికాయి. వాటిని పట్టుకుని మళ్లీ దర్యాప్తు చేశాము. నిందితులను అరెస్ట్​ చేశాము," అని పోలీసులు వెల్లడించారు. కాగా.. దర్యాప్తును ఎందుకు తిరిగి ప్రారంభించాల్సి వచ్చింది? అన్న విషయంపై అధికారులు స్పందించలేదు.

పోలీసుల ప్రకారం.. చంద్రవీర్​ను.. సవిత, ఆమె ప్రియుడు తొలుత పిస్టోల్​తో కాల్చారు. ఆ తర్వాత గొడ్డలితో నరికారు. నేరం కోసం వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

ప్రియురాలి శరీరాన్ని ముక్కలుగా నరికి..

Man kills live in partner : దేశంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ మహిళను, తన ప్రియుడు హత్య చేసి.. శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో కలకలం సృష్టించింది.

26ఏళ్ల శ్రద్ధ.. ముంబైలోని ఓ ఎంఎన్​సీలో పని చేసేది. అక్కడే ఆమెకు అఫ్తబ్​ అమీన్​ పూనావాలా అనే వ్యక్తితో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమగా మారింది. కానీ వారి ప్రేమకు ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు. చివరికి.. వారిద్దరు ముంబైని విడిచి ఢిల్లీకి వెళ్లారు.

ఈ ఏడాది తొలినాళ్లల్లో.. ఢిల్లీలోని మెహ్రౌలిలో ఓ ఫ్లాట్​ తీసుకుని ఇద్దరు కలిసి సహజీవనం మొదలుపెట్టారు. ఇలా రోజులు గడిచాయి. కానీ ఓరోజు.. శ్రద్ధను ఆ వ్యక్తి చంపేశాడు. శరీరాన్ని 35 ముక్కలుగా నరికి.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

IPL_Entry_Point

సంబంధిత కథనం