‘డబ్బులు వేస్ట్​ అవ్వకూడదు’ అని కేన్సర్​ బాధితుడి ఆత్మహత్య- భార్యను కూడా చంపి..-ghaziabad man kills wife and self citing cancer diagnosis police ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ‘డబ్బులు వేస్ట్​ అవ్వకూడదు’ అని కేన్సర్​ బాధితుడి ఆత్మహత్య- భార్యను కూడా చంపి..

‘డబ్బులు వేస్ట్​ అవ్వకూడదు’ అని కేన్సర్​ బాధితుడి ఆత్మహత్య- భార్యను కూడా చంపి..

Sharath Chitturi HT Telugu

కేన్సర్​తో బాధపడుతున్న ఓ వ్యక్తి, చికిత్సకు డబ్బులు వృథా చేయకూడదన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అంతేకాదు, కలిసి జీవిస్తామని ప్రతిజ్ఞ చేశామంటూ.. ఆత్మహత్య చేసుకునే ముందు భార్యను చంపేశాడు.

ఘజియాబాద్​లో దారుణం..

ఉత్తర్​ప్రదేశ్​లో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది! తనకు కేన్సర్​ ఉందని తేలడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి, చికిత్సకు డబ్బులు వృథా అవ్వకూడదన్న కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్య చేసుకునే ముందు.. తన భార్యను కాల్చి చంపేశాడు.

అసలేం జరిగిందంటే..

యూపీ ఘజియాబాద్​లోని నంద్​గ్రామ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివాసముంటున్న 57ఏళ్ల వ్యక్తి ఒక ప్రాపర్టీ డీలర్​. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆయన జీవిస్తున్నాడు.

కాగా ఆయనకి కేన్సర్​ ఉందని ఇటీవలే తేలింది. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం 11 గంటలకు తన ఇంటి గ్రౌండ్​ ఫ్లోర్​లో తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి అంతస్తులో ఉన్న పిల్లలు తుపాకీ శబ్దానికి ఉల్లిక్కిపడి కిందకు పరిగెత్తారు. అప్పటికే తల్లిదండ్రులు మరణించారు.

ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలిచారు. ఫోరెన్సీక్​ టీమ్​ ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించింది.

ఇంతలో కేన్సర్​ బాధితుడి సూసైడ్​ నోట్​ పోలీసులకు లభించింది.

"ఆ వ్యక్తి కేన్సర్​తో బాధపడుతున్నాడు. బుధవారం తన లైసెన్స్​డ్​ రివాల్వర్​తో తొలుత భార్యను షూట్​ చేసి చంపాడు. ఆ తర్వాత తనని తాను కాల్చుకుని సూసైడ్​ చేసుకున్నాడు. ఘటనాస్థలంలో సూసైడ్​ నోట్​ కనిపించింది. తాను కేన్సర్​తో బాధపడుతున్నానని, కుటుంబానికి భారం అవ్వకూడదని, చికిత్సకు డబ్బులు వృథా అవ్వకూడదని బాధితుడు రాశాడు. వాస్తవానికి తన కుటుంబానికి అసలు తన కేన్సర్​ విషయం తెలియదని సూసైడ్​ నోట్​లో వివరించాడు. చనిపోయే ముందు, తన భార్యని కూడా చంపేశాడు," అని నంద్​గ్రామ్​ సర్కిల్​ ఏసీపీ పూనమ్​ మిశ్రా తెలిపారు.

కేన్సర్​కి చికిత్స చేసినా బతికే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు భావించిన ఆ 57ఏళ్ల వ్యక్తి, చనిపోవడం ఉత్తమం అని భావించినట్టు సూసైడ్​ నోట్​ ద్వారా తెలుస్తోందని అధికారులు వెల్లడించారు. "కలిసి ఉంటామని ప్రతిజ్ఞ చేశాము" కాబట్టి తనతో పాటు తన భార్యను కూడా తీసుకెళ్లిపోతున్నట్టు బాధితుడు ఆ నోట్​లో రాశాడని వివరించారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు, అన్ని కోణాల్లోనూ విచారణ చేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.