ముంబై ఇండియన్స్​ మాజీ క్రికెటర్​ అరెస్ట్​- పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళపై అత్యాచారం!-former mi cricketer shivalik sharma arrested on rape charges ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ముంబై ఇండియన్స్​ మాజీ క్రికెటర్​ అరెస్ట్​- పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళపై అత్యాచారం!

ముంబై ఇండియన్స్​ మాజీ క్రికెటర్​ అరెస్ట్​- పెళ్లి చేసుకుంటానని చెప్పి మహిళపై అత్యాచారం!

Sharath Chitturi HT Telugu

ముంబై ఇండియన్స్​ మాజీ క్రికెటర్​, బరోడా రంజీ ప్లేయర్​ శివాలిక్​ శర్మను పోలీసులు ఆరెస్ట్​ చేశారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి తనను శివాలిక్​ రేప్​ చేసినట్టు మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్​ చేశారు.

ముంబై ఇండియన్స్​ మాజీ క్రికెటర్​ అరెస్ట్​!

ముంబై ఇండియన్స్ మాజీ క్రికెటర్ శివాలిక్ శర్మను పోలీసులు అరెస్ట్​ చేశారు. అత్యాచారం కేసులో భాగంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. ముంబై ఇండియన్స్​ మాత్రమే కాదు కృనాల్, హార్దిక్​లతో కలిసి బరోడా తరఫున కూడా ఆడాడు ఈ 26ఏళ్ల క్రికెటర్​.

‘పెళ్లి చేసుకుంటానని చెప్పి..’

క్రికెటర్​తో రిలేషన్​షిప్​లో ఉన్న ఓ మహిళ.. రాజస్థాన్​ జోధ్​పూర్​లోని కుడి భగత్సాని పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేయడంతో శివాలిక్​ని పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచి, జ్యుడీషియల్ రిమాండ్​కు తరలించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శివాలిక్ తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని మహిళ ఆరోపించింది.

వీరిద్దరూ రెండు నెలల క్రితం వడోదరలో కలుసుకున్నారని, ఆ తర్వాత ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడ్డాయని, అప్పటి నుంచి ఫోన్ ద్వారా టచ్​లో ఉన్నారని తెలుస్తోంది.

పాండ్యా సోదరులతో శివాలిక్​ శర్మ
పాండ్యా సోదరులతో శివాలిక్​ శర్మ

ఎవరీ శివాలిక్ శర్మ?

బరోడాకు చెందిన ఈ క్రికెటర్ ఎడమచేతి వాటం బ్యాటింగ్ ఆల్​రౌండర్. 2018లో దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేసి 18 ఫస్ట్​క్లాస్​ మ్యాచ్​లు ఆడి 1,087 పరుగులు చేశాడు. శివాలిక్ 13 లిస్ట్ ఏ మ్యాచ్ లు, 19 టీ20లు ఆడి వరుసగా 322, 349 పరుగులు చేశాడు. లెగ్​బ్రేక్​ గూగ్లీ వెరైటీతో దేశవాళీ మ్యాచ్​లలో మూడు వికెట్లు పడగొట్టాడు.

శివాలిక్ చివరిసారిగా ఈ ఏడాది జనవరిలో బరోడా తరఫున రంజీ ట్రోఫీలో పాల్గొన్నాడు.

2023 సీజన్​కి ముందు జరిగిన ఐపీఎల్ వేలంలో శివాలిక్​ని ముంబై ఇండియన్స్ రూ.20 లక్షల బేస్ ప్రైజ్​కి కొనుగోలు చేసింది. కానీ అతను గ్రౌండ్​లో కనిపించలేదు. గత నవంబర్​లో జరిగిన మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ అతన్ని విడుదల చేసింది.

కదులుతున్న కారులో బాలికపై అత్యాచారం..

దేశంలో మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. 15ఏళ్ల బాలికపై కదులుతున్న కారులో అత్యాచారం జరిగిన ఘటన తాజాగా హరియాణాలోని ఫరిదాబాద్​లో చోటుచేసుకుంది.

పాఠశాలకు వెళ్తుండగా బాలికను అపహరించి కదులుతున్న కారులో రెండుసార్లు అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పదో తరగతి చదువుతున్న బాధితురాలు శనివారం ఉదయం తన సోదరుడిని పాఠశాలకు డ్రాప్ చేసేందుకు వెళ్లింది.

సోదరుడిని దింపి బాలిక తన పాఠశాలకు వెలుతుండగా పార్కింగ్ చేసి ఉన్న ఓ కారులో కూర్చున్న ఓ వ్యక్తి విండో తెరిచి ఆమెను లోపలికి లాక్కెళ్లాడు. ఓ వ్యక్తి వాహనాన్ని నడుపుతుండగా, మరో వ్యక్తి తనపై రెండుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించినట్టు ఆమె వివరించింది.

పాఠశాల మూసేసే సమయంలో ఆమెను గ్రామ సమీపంలో కారులో నుంచి తోసేసి నిందితులు పరారయ్యారు. ఇంటికి చేరుకున్న ఆమె తనకు జరిగిన ఘోరాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఆదివారం పోలీసులను ఆశ్రయించారు. భారతీయ న్యాయ సంహిత, లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.