పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా, భారత భద్రతా దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేశాయి. ఈ దాడుల్లో 100కు పైగా ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం.
దేశవ్యాప్తంగా ఈ ప్రతీకార చర్యపై ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవాణే X (ట్విట్టర్)లో "పిక్చర్ అభీ బాకీ హై" అని పోస్ట్ చేశారు. అంటే ఇంకా సినిమా మిగిలే ఉందని పరోక్షంగా చెప్పారు. అంటే ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా భారత్ మరిన్ని దాడులుచేయొచ్చని సంకేతాలు ఇచ్చారు.
భారత సాయుధ దళాలు పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా మంగళవారం అర్ధరాత్రి పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు చేశాయి. లష్కరే తొయిబా మరియు జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థల స్థావరాలు కూడా ఈ దాడుల్లో ధ్వంసమయ్యాయి.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పౌరులు మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా 'ఆపరేషన్ సింధూర్' పేరుతో భారత్ ఈ సైనిక చర్య చేపట్టింది.
రక్షణ మంత్రిత్వ శాఖ అర్ధరాత్రి 1:44 గంటలకు ఒక ప్రకటనలో, "కొద్దిసేపటి క్రితం, భారత సాయుధ దళాలు పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో భారత్పై ఉగ్రవాద దాడులకు కుట్ర పన్నిన ఉగ్రవాద స్థావరాలపై 'ఆపరేషన్ సింధూర్' ప్రారంభించాయి" అని తెలిపింది.
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ భారత క్షిపణి దాడులను "యుద్ధ చర్య"గా అభివర్ణించారు. తమ దేశానికి "తగిన ప్రతిస్పందన" ఇచ్చే హక్కు ఉందని అన్నారు.
"ఏ పాకిస్తానీ సైనిక స్థావరంపై దాడి జరగలేదు. లక్ష్యాల ఎంపిక మరియు అమలు విధానంలో భారత్ గరిష్ట సంయమనం పాటించింది" అని భారత్ ప్రకటించింది.
భారత సాయుధ దళాల చర్య "లక్ష్యపూర్వకంగా, ఖచ్చితంగా ఉంది. పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకున్నారు" అని కూడా ప్రకటనలో పేర్కొంది.
తొమ్మిది స్థావరాలపై జరిగిన దాడులు విజయవంతమయ్యాయని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'ఆపరేషన్ సింధూర్'ను నిశితంగా పర్యవేక్షించారని వర్గాలు తెలిపాయి.
టాపిక్