ఛత్తీస్ గఢ్ లోని నారాయణపూర్ జిల్లాలో బుధవారం తెల్లవారు జాము నుంచి భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. మావోయిస్టుల మాడ్ డివిజన్ కు చెందిన సీనియర్ కేడర్లు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో నాలుగు జిల్లాలకు చెందిన జిల్లా రిజర్వ్ గార్డ్స్ పోలీసు బృందాలు అభుజ్ మఢ్ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టగా, నక్సలైట్లు వారిపై కాల్పులు జరిపారు. ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో కకావికలైన మావోయిస్టులు బుధవారం నాటి ఎన్ కౌంటర్ తో మరింత దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. నారాయణపూర్ ఎన్ కౌంటర్ లో సుమారు 25 మంది వరకు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
చత్తీస్గడ్ నారాయణపూర్ ఎన్కౌంటర్లో మావోల కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. నారాయణపూర్ జిల్లా మాధ్ అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. బసవరాజు ఉన్నాడనే సమాచారంతో ఆ ప్రాంతాన్ని బలగాలు చుట్టుముట్టాయి. నారాయణపూర్,బీజాపూర్, దంతేవాడ బలగాల నేతృత్వంలో ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఎన్ కౌంటర్ లో బసవరాజు సహా పలువురు మావోయిస్టుల మృతి చెందినట్టు తెలుస్తోంది. బసవరాజుపై రూ. 1.5 కోట్ల రివార్డు ఉంది. బసవరాజు మృతిపై మరి కాసేపట్లో నారాయణపూర్ ఎస్పీ అధికారికంగా ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
సంబంధిత కథనం