ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల తేదీ ఖరారు-election commission releases date of rajya sabha elections to 56 seats ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల తేదీ ఖరారు

ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల తేదీ ఖరారు

HT Telugu Desk HT Telugu

50 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, మరో ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది.

శీతాకాల సమావేశాల్లో రాజ్యసభ సభ్యులు (PTI)

దేశంలోని 15 రాష్ట్రాల నుంచి 56 స్థానాలకు రాజ్యసభ ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. పార్లమెంటు ఎగువ సభ సభ్యత్వానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం తెలిపింది.

ఉత్తరప్రదేశ్ (10), మహారాష్ట్ర (6), బీహార్ (6), పశ్చిమ బెంగాల్ (5), మధ్యప్రదేశ్ (5), గుజరాత్ (4), కర్ణాటక (4), ఆంధ్రప్రదేశ్ (3), తెలంగాణ (3), రాజస్థాన్ (3), ఒడిశా (3), ఉత్తరాఖండ్ (1), ఛత్తీస్గఢ్ (1), హర్యానా (1), హిమాచల్ ప్రదేశ్ నుంచి (1) స్థానానికి రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.

రాజ్యసభ అనేది పార్లమెంటు యొక్క శాశ్వత సభ. దీనిలో సభ్యులు 6 సంవత్సరాల కాలానికి ఎన్నికవుతారు. ప్రతి రెండు సంవత్సరాలకు మూడింట ఒక వంతు మంది సభ్యులు పదవీ విరమణ చేస్తారు. రాజ్యసభ నిరంతర కార్యకలాపాల కొనసాగింపునకు ఇది సహాయపడుతుంది.

50 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుండగా, మిగిలిన ఆరుగురి పదవీకాలం ఏప్రిల్ 3తో ముగియనుంది.

2024 రాజ్యసభ ఎన్నికల పూర్తి షెడ్యూల్

నోటిఫికేషన్ఫిబ్రవరి 8
నామినేషన్లకు చివరి తేదీఫిబ్రవరి 15
నామినేషన్ల పరిశీలనఫిబ్రవరి 16
అభ్యర్థిత్వం ఉపసంహరణకు గడువుఫిబ్రవరి 20
ఎన్నికల తేదీఫిబ్రవరి 27
ఎన్నికల సమయం9am - 4pm
ఓట్ల లెక్కింపుఫిబ్రవరి 27, 5pm
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేందుకు గడువుఫిబ్రవరి 29

ప్రస్తుత రాజ్యసభలో మొత్తం 238 మంది సభ్యులు ఉండగా, బీజేపీ అత్యధికంగా 93, కాంగ్రెస్ 30, తృణమూల్ కాంగ్రెస్ 13, ఆమ్ ఆద్మీ పార్టీ 10, ద్రవిడ మున్నేట్ర కజగం పార్టీలకు 10 స్థానాలు ఉన్నాయి.

అంతేకాక కళలు, సాహిత్యం, శాస్త్రాలు మరియు సామాజిక సేవలకు చేసిన కృషికి గాను రాష్ట్రపతి 12 మంది సభ్యులను ఎగువ సభకు నామినేట్ చేస్తారు.

ప్రజాస్వామ్యం యొక్క పార్లమెంటరీ రూపంలో రాజ్యసభ కీలక పాత్ర పోషిస్తుంది. దీనినే 'పెద్దల సభ'గా వ్యవహరిస్తారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.