5 states election 2023 : నవంబర్​ 7 నుంచి 30 వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు-election commission announces poll schedule for telangana and other states live updates ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  5 States Election 2023 : నవంబర్​ 7 నుంచి 30 వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు

5 states election 2023 : నవంబర్​ 7 నుంచి 30 వరకు ఐదు రాష్ట్రాల ఎన్నికలు

Sharath Chitturi HT Telugu
Oct 09, 2023 01:02 PM IST

5 states election 2023 : ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ను ఈసీ ప్రకటించింది. తెలంగాణలో నవంబర్​ 30న పోలింగ్​ జరగనుంది. ఆ వివరాలు..

ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదల
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ విడుదల

5 states election schedule 2023 : దేశంలో ఎన్నికల సమరానికి రంగం సిద్ధమైంది. 2024 లోక్​సభ ఎన్నికలకు సెమీఫైనల్స్​గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ని ప్రకటించింది ఈసీ. ఆ వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

yearly horoscope entry point

5 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ ఇదే..

తెలంగాణ, రాజస్థాన్​, మిజోరం, మధ్యప్రదేశ్​, ఛత్తీస్​గఢ్​ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో నవంబర్​ 7 నుంచి నవంబర్​ 30 మధ్యలో పోలింగ్​ జరుగుతుంది.

  • మిజోరంలో నవంబర్​ 7న ఒక దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న కౌంటింగ్​ ప్రక్రియ ఉంటుంది.
  • ఛత్తీస్​గఢ్​లో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ తేదీ నవంబర్​ 7గా ఉండగా.. రెండో దశ తేదీ నవంబర్​ 17గా ఉంది. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడతాయి.
  • Telangana Assembly election date : మధ్యప్రదేశ్​లో నవంబర్​ 17న ఒకే దశలో పోలింగ్​ జరగనుంది. డిసెంబర్​ 3న ఫలితాలను ప్రకటిస్తుంది ఈసీ.
  • రాజస్థాన్​లో నవంబర్​ 23న పోలింగ్​ ఉంటుంది. ఫలితాలు డిసెంబర్​ 3న బయటకు వస్తాయి.
  • తెలంగాణలో నవంబర్​ 30న ఒక దశలో పోలింగ్​ జరుగుతుంది. అన్ని రాష్ట్రాలతో కలిపి.. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడతాయి.

5 రాష్ట్రాల్లో 1.77లక్షల పోలింగ్​ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ 1.77లక్షల పోలింగ్​ కేంద్రాల్లో 17,734 మోడల్​ పోలింగ్​ స్టేషన్స్​ ఉంటాయని, 621 పోలింగ్​ కేంద్రాలను పీడబ్ల్యూడీ సిబ్బంది నిర్వహిస్తారని స్పష్టం చేసింది. ఈసారి.. 5 రాష్ట్రాల్లో దాదాపు 60లక్షల మంది తొలిసారి ఓటు హక్కు సాధించారని తెలిపింది. మొత్తం మీద ఈ 5 రాష్ట్రాల్లో దాదాపు 16కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ప్రస్తుత రాజకీయ సమీకరణలు..

Telangana assembly election results : తెలంగాణలో మొత్తం 119 సీట్లు ఉండగా.. మెజారిటీ సాధించాలంటే 60 స్థానాల్లో గెలవాల్సిందే. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ పార్టీ 88 సీట్లలో గెలిచింది. కాంగ్రెస్​కు 19 సీట్లు దక్కాయి. బీజేపీ ప్రభావం చూపించలేకపోయింది.

ఛత్తీస్​గఢ్​లో మొత్తం 90 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. మెజారిటీ మార్క్​ వచ్చేసి 46. 2018లో.. 68 స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్​.. బీజేపీని ఓడించి ప్రభుత్వాన్ని స్థాపించింది. బీజేపీకి 15 సీట్లే వచ్చాయి!

రాజస్థాన్​లో.. 2018లో అప్పటివరకు అధికారంలో ఉన్న బీజేపీని ఓడించింది కాంగ్రెస్​. 200 సీట్ల అసెంబ్లీలో మెజారిటీ మార్క్​ పొందాలంటే 101 స్థానాల్లో గెలవాల్సి ఉంది. నాటి ఎన్నికల్లో ఏకంగా 108 సీట్లు సాధించింది కాంగ్రెస్​. బీజేపీకి 73 సీట్లే వచ్చాయి.

Madhya Pradesh Assembly election date : మధ్యప్రదేశ్​లో మొత్తం 230 సీట్లు ఉన్నాయి. 116 మ్యాజిక్​ ఫిగర్​. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో 114 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్​. బీజేపీకి 109 స్థానాలే దక్కాయి. కాంగ్రెస్​ ప్రభుత్వాన్నిస్థాపించినా.. నిలబెట్టుకోలేకపోయింది. ప్రస్తుతం అక్కడ బీజేపీ అధికారంలో ఉంది.

ఈశాన్య భారత దేశంలో భాగమైన మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. మ్యాజిక్​ ఫిగర్​ 21. 2018 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో.. ఇక్కడ ఎన్​డీఏ కూటమి విజయం సాధించింది. మొత్తం 26 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్​ పార్టీ కేవలం 5 చోట్లే ఖాతా తెరవగలిగింది.

Whats_app_banner

సంబంధిత కథనం