నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ-ed files chargesheet against sonia rahul in national herald case ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ

Sudarshan V HT Telugu

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ (Rahul Singh)

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ ఓవర్సీస్ చీఫ్ శామ్ పిట్రోడాపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసింది.

ఏప్రిల్ 25 నుంచి వాదనలు

చార్జిషీట్ లో సుమన్ దూబే తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. ఈ కేసులో వాదనలను ఏప్రిల్ 25వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు తెలిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002లోని సెక్షన్ 44, 45 కింద ప్రాసిక్యూషన్ ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఈడీ తెలిపింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు సంబంధించిన మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా జప్తు చేసిన ఢిల్లీ, ముంబై, లక్నోలోని రూ.661 కోట్ల విలువైన స్థిరాస్తులను స్వాధీనం చేసుకోవడానికి ఏప్రిల్ 12న ఈడీ నోటీసులు జారీ చేసింది.

గతంలో ఆస్తుల జప్తు

నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్, ఆ వార్తాపత్రిక యజమాని యంగ్ ఇండియన్ పై నమోదైన పీఎంఎల్ఏ కేసులో తాత్కాలిక అటాచ్మెంట్ ఆర్డర్ జారీ చేయడం ద్వారా ఈడీ గతంలో ఈ ఆస్తులను జప్తు చేసింది. కాంగ్రెస్ ఇచ్చిన రుణానికి బదులుగా ఏజేఎల్, దాని ఆస్తులను కేవలం రూ.50 లక్షలకు యంగ్ ఇండియన్ సంస్థ స్వాధీనం చేసుకుందని ఈడీ ఆరోపిస్తోంది. యంగ్ ఇండియన్ సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 2022లో సోనియా, రాహుల్ లను విచారించారు.

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసు ఏమిటి?

సోనియా, రాహుల్ గాంధీ, ఇతర సీనియర్ కాంగ్రెస్ నేతలు కేవలం రూ.50 లక్షలకు ఏజేఎల్ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని ఆరోపిస్తూ సుబ్రమణ్యస్వామి 2014లో ఫిర్యాదు చేయడంతో నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దర్యాప్తు ప్రారంభించింది. ఈ ఆస్తుల విలువ రూ.2,000 కోట్లకు పైగా ఉంటుంది.

Sudarshan V

eMail
వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.