Earthquake today : నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భారీ భూకంపం, భారత్​లో ప్రకంపనలు..-earthquake today magnitude 7 1 hits tibet nepal tremors felt in india ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Earthquake Today : నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భారీ భూకంపం, భారత్​లో ప్రకంపనలు..

Earthquake today : నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భారీ భూకంపం, భారత్​లో ప్రకంపనలు..

Sharath Chitturi HT Telugu

Earthquake today : టిబెట్​లో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి నేపాల్​ సహా బీహార్​, అసోం, దిల్లీ- ఎన్​సీఆర్​లో భూమి కంపించింది. ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు.

నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భూకంపం..

టిబెట్​ని భారీ భూకంపం కుదిపేసింది! మంగళవారం తెల్లవారుజామున 7.1 తీవ్రతతో భూమి కంపించినట్టు తెలుస్తోంది. టిబెట్​లో భూకంపం కారణంగా అటు నేపాల్​తో పాటు ఇటు భారత్​లోని దిల్లీ-ఎన్​సీఆర్​, బీహార్​, అసోంలో కూడా ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి.

టిబెట్​లో భూకంపం- ఇతర చోట్ల ప్రకంపనలు..

వాస్తవానికి తొలుత నేపాల్​- టిబెట్​ సరిహద్దులో భూకంపం సంభవించిందని కథనాలు వెలువడ్డాయి. అయితే, యూఎస్​ జియోలాజికల్​ సర్వే ప్రకారం టిబెట్​లోని జిజాంగ్​కు సమీపంలో, 10కి.మీల లోతులో భూకంపం వచ్చింది. ఈ ప్రాంంతం నేపాల్​కి సమీపంలో ఉంది.

అయితే చైనా భూకంప పర్యవేక్షణ ఏజెన్సీ మాత్రం మంగళవారం తెల్లవారుజామున టిబెట్​ రాజధాని లాసాకు 380 కి.మీల దూరంలో 6.8 తీవ్రతతో భూమి కంపించిందని నివేదించింది. ఆ ప్రాంతంలో చాలా మంది నివాసముంటున్నట్టు వెల్లడించింది.

అయితే.. తాజా భూకంపానికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వెలుగులోకి రాలేదు.

ఏదిఏమైనా నేపాల్​ మాత్రం భూ ప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. ఖాట్మాండూలో సైతం ప్రకంనలు వెలుగులోకి వచ్చాయి. నేపాల్​లో మౌంట్​ ఎవరెస్ట్​కి సమీపంలోని ప్రాంతాల్లో కూడా భూమి కంపించింది. ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు నిద్రలో నుంచి లేచి ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

నేపాల్ ఒక ప్రధాన భౌగోళిక “ఫాల్ట్ లైన్”పై ఉంది. ఇక్కడ ఇండియన్​ టెక్టోనిక్ ప్లేట్- యురేషియా ప్లేట్​లోకి నెట్టడం జరుగుతుంది. ఫలితంగా క్రమం తప్పకుండా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి.

2015లో నేపాల్ లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంలో దాదాపు 9,000 మంది మరణించగా, 22,000 మందికి పైగా గాయపడ్డారు.

భారత్​లో కూడా..

ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాల్లో కూడా భూమి కంపించిందంటే.. టిబెట్​లో సంభవించిన భారీ భూంకపం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. బీహార్​లో ఫ్యాన్లు, సీలింగ్​కి వేలాడుతున్న బల్బులు ఊగుతున్న దృశ్యాలు సోషల్​ మీడియాలో వైరల్​ అయ్యాయి. భూకంపం ధాటికి, అప్పటివరకు నిద్రిస్తున్న ప్రజలు ఒక్కసారిగా నిద్రలేచి, బయటకు పరుగులు తీశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.