అమెరికా మధ్యవర్తిత్వంలో సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, పాకిస్థాన్ లు పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. వివాదాన్ని పరిష్కరించడంలో కామన్ సెన్స్, ఇంటెలిజెన్స్ ను ప్రదర్శించినందుకు ఇరు దేశాలను ఆయన అభినందించారు.
అమెరికా మధ్యవర్తిత్వంలో సుదీర్ఘ చర్చల అనంతరం భారత్, పాక్ లు కాల్పుల విరమణకు అంగీకరించాయని ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. ‘‘కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించినందుకు ఇరు దేశాలకు అభినందనలు. ఈ విషయంలో మీరు శ్రద్ధ చూపినందుకు ధన్యవాదాలు’’ అని ట్రూత్ సోషల్ లో ట్రంప్ ఒక పోస్ట్ లో చెప్పారు.
ఇదిలావుండగా, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా భారతదేశం మరియు పాకిస్తాన్ కు చెందిన సీనియర్ అధికారులతో చర్చల తరువాత, తక్షణ కాల్పుల విరమణకు మరియు కీలక అంశాలపై చర్చలు ప్రారంభించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని ప్రకటించారు. ‘‘గత 48 గంటల్లో, @VP వాన్స్ మరియు నేను సీనియర్ భారత, పాకిస్తాన్ అధికారులతో నిమగ్నమయ్యాము. ఇందులో ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్, విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అసిమ్ మునీర్, జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, అసిమ్ మాలిక్ ఉన్నారు’’ అని రూబియో తెలిపారు
శాంతి కోసం ప్రధాని మోదీ, షరీఫ్ నాయకత్వం కట్టుబడి ఉందని కొనియాడారు. తక్షణ కాల్పుల విరమణకు భారత్, పాక్ ప్రభుత్వాలు అంగీకరించాయని, తటస్థ ప్రదేశంలో విస్తృత అంశాలపై చర్చలు ప్రారంభించడానికి నేను సంతోషిస్తున్నాను. శాంతి మార్గాన్ని ఎంచుకోవడంలో ప్రధాని మోదీ, షరీఫ్ విజ్ఞత, వివేకం, రాజనీతిజ్ఞతను అభినందిస్తున్నాం' అని రూబియో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన నేపథ్యంలో భారత్, పాక్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆ దేశ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ శనివారం ధ్రువీకరించారు. తక్షణమే కాల్పుల విరమణకు భారత్, పాక్ అంగీకరించాయి. తన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో రాజీపడకుండా ఈ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం పాకిస్థాన్ ఎల్లప్పుడూ కృషి చేస్తుందన్నారు. దార్ ఎక్స్ లో చెప్పాడు.
సంబంధిత కథనం