మహా కుంభమేళాకు వెళ్లలేకపోతున్న వారి కోసం ‘డిజిటల్​ స్నానాలు’! ఇలా కూడా సంపాదించేస్తున్నారు..-digital snan for 1 100 man dips photos at mahakumbh internet reacts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మహా కుంభమేళాకు వెళ్లలేకపోతున్న వారి కోసం ‘డిజిటల్​ స్నానాలు’! ఇలా కూడా సంపాదించేస్తున్నారు..

మహా కుంభమేళాకు వెళ్లలేకపోతున్న వారి కోసం ‘డిజిటల్​ స్నానాలు’! ఇలా కూడా సంపాదించేస్తున్నారు..

Sharath Chitturi HT Telugu

Maha Kumbh Mela Digital snan : మహా కుంభమేళాకు వెళ్లలేకపోతున్నారా? అయితే మీరు ‘డిజిటల్​ స్నానం’ చేస్తారా? డిజిటల్​ స్నానం ఏంటి? అనుకుంటున్నారా! అయితే ఇది చూసేయండి..

మహా కుంభమేళాలో దృశ్యం.. (PTI)

జనవరి 13న మొదలైన మహా కుంభమేళా ముగింపు దశకు చేరుకుంటోంది. ఫిబ్రవరి 26తో ప్రయాగ్​రాజ్​ మహా కుంభమేళా ముగియనుంది. ఇప్పటికే 55 కోట్లకుపైగా మంది భక్తులు సంగం వద్ద పవిత్ర స్నానాలు చేశారు. అయితే, ఒక స్థానిక ఎంటర్​ప్రెన్యూర్​.. వినూత్నంగా ఆలోచించాడు! అదే.. ‘డిజిటల్​ స్నానం’! ఆయన చేసిన పని తెలిస్తే.. “ఇలా కూడా డబ్బు సంపాదించవచ్చా? ” అని అనిపించడం ఖాయం.

ఏంటి ఈ డిజిటల్​ స్నానం..?

మహా కుంభమేళాకు వెళ్లాలని ప్రయత్నిస్తున్నా, వెళ్లలేకపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వీరి కోసమే 'డిజిటల్​ స్నానం' సేవను తీసుకొచ్చారు దీపక్​ అనే వ్యక్తి. మీరు వాట్సాప్​ ద్వారా ఫొటోలను షేర్​ చేస్తే, ఆయన ఆ ఫొటోలను ప్రింటౌట్​ తీసీ, వాటిని సంగంలో ముంచుతాడు. అలా మీకు ‘డిజిటల్​ స్నానం’ చేయిస్తాడు! ఇందుకోసం ఆయన రూ. 1,100 తీసుకుంటాడు.

ప్రముఖ యూట్యూబర్​, ‘దేశభక్త్​’ ఆకాశ్​ బెనర్జీ ఈ వీడియోని షేర్​ చేశారు. ఈ వీడియోలో సదరు వ్యక్తి.. తాను చేసే డిజిటల్​ స్నానం గురించి సవివరంగా చెబుతున్నాడు. ఈ వీడియో చూసిన వారందరు.. “వాహ్​ వాట్​ ఆన్​ ఐడియా” అని అనుకుంటున్నారు.

ఆ పోస్ట్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఈ పోస్టుకు ఇంటర్నెట్ నుంచి రకరకాల స్పందనలు వచ్చాయి. 'చైనాకు డీప్​సీక్ ఉంది. మనకి డీప్​ స్నాన్​ ఉంది' అని ఒక యూజర్ చమత్కరించారు. మరొకరు 'రామ్ నామ్ కీ లూట్ హై, లూట్ సాకే టు లూట్ (దేవుడి పేరుతో దోచుకుంటున్నారు)' అంటూ కామెంట్ చేశారు. చాలా మంది ఈ తరహా సేవను "అంధభక్తి" (గుడ్డి విశ్వాసం) గా అభివర్ణించారు.

మహా కుంభమేళా 2025..

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక, సాంస్కృతిక సమ్మేళనమైన మహా కుంభమేళా 2025 పౌష్ పౌర్ణమి (జనవరి 13, 2025) నాడు ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది. జనవరి 26 నుంచి గత 20 రోజులుగా త్రివేణి సంగంలో రోజుకు సగటున కోటి మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారని, కుంభమేళా చరిత్రలో ఎన్నడూ చూడలేదని ప్రభుత్వం పేర్కొంది.

మొత్తం స్నానాల సంఖ్య 52.96 కోట్లు దాటింది. ఇది అధికారిక అంచనా 40 నుంచి 45 కోట్ల కన్నా 10% ఎక్కువ. మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి రోజువారీ సందర్శకులను విశ్లేషిస్తే మౌని అమావాస్య నాడు తొక్కిసలాట జరిగినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూనే ఉన్నారని తెలుస్తుంది. ఈ ప్రవాహం తగ్గే సూచనలు కనిపించడం లేదు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.