1971 యుద్ధం తర్వాత తొలిసారి ‘డ్రిల్​’- రేపు దేశంలో జరగబోయేది ఇదే..-details of may 7 security mock drill revealed amid pahalgam terror attack tensions ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  1971 యుద్ధం తర్వాత తొలిసారి ‘డ్రిల్​’- రేపు దేశంలో జరగబోయేది ఇదే..

1971 యుద్ధం తర్వాత తొలిసారి ‘డ్రిల్​’- రేపు దేశంలో జరగబోయేది ఇదే..

Sharath Chitturi HT Telugu

దేశవ్యాప్తంగా మే7, బుధవారం సెక్యూరిటీ డ్రిల్​ జరగనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఇప్పటికే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నోటిఫికేషన్​ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మే 7న అసలు ఏం జరుగుతుందో ఇక్కడ తెలుసుకోండి..

బీఎస్​ఎఫ్​ జవాన్లు (AFP)

పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్రం చేసిన సిఫార్సుల మేరకు మే7, బుధవారం 'సెక్యూరిటీ మాక్​ డ్రిల్స్​'ని నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్​తో తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న తరుణంలోనే రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులకు సెక్యూరిటీ డ్రిల్స్​ నిర్వహించాలని కేంద్రం చెప్పడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

చివరిసారిగా దేశంలో 1971 యుద్ధానికి ముందు ఈ తరహా డ్రిల్​ జరిగింది! నాటి యుద్ధంలో భారత్​ చేతిలో పాక్​ ఓడిపోవడమే కాదు, బంగ్లాదేశ్​ అనే కొత్త దేశం ఉద్భవించింది.

కాగా మే 7, బుధవారం నాడు జరిగే సెక్యూరిటీ డ్రిల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

సెక్యూరిటీ డ్రిల్​- ఎవరెవరు పాల్గొంటారు?

రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్​ ప్రకారం.. 244 సివిల్​ డిఫెన్స్​ డిస్ట్రిక్ట్స్​లో ఈ డ్రిల్​ జరుగుతుంది. గ్రామ స్థాయిల నుంచి డ్రిల్​ నిర్వహణకు ప్రణాళికలు రచించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎదురైనా, వాటికి పూర్తిస్థాయిలో రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాలు సన్నద్ధంగా ఉండేందుకు ఈ మాక్​ డ్రిల్స్​ ఉపయోగపడుతుంది.

"ఈ డ్రిల్​లో జిల్లా కంట్రోలర్​, జిల్లా అధికారులు, సివిల్​ డిఫెన్స్​ వార్డెన్లు, వాలంటీర్లు, హోంగార్డులు, ఎన్​సీసీ, ఎన్​ఎస్​ఎస్​, ఎన్​వైకేఎస్​, కాలేజీ- స్కూల్​ విద్యార్థులు చురుకుగా పాల్గొనాలి," అని హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్​లో ఉంది. "తీవ్ర విపత్కర పరిస్థితుల"ను ఎదుర్కొనే విధంగా పౌరులకు శిక్షణ ఇవ్వాలని పేర్కొంది.

మే 7న జరిగే మాక్​ డ్రిల్​లో ఏం చేయాలో కూడా హోంశాఖ జారీ చేసిన నోటిఫికేషన్​లో ఉంది.

మాక్​ డ్రిల్​లో.. ఎయిర్​ రైడ్​ వార్నింగ్​ సిస్టెమ్​ ఎంత మెరుగ్గా పనిచేస్తుందో చెక్​ చేయాలి. అదే సమయంలో వాయుదాడులకు ఎలాంచి చర్యలు చేపట్టాలో ప్రజలకు శిక్షణ ఇవ్వాలి. వాయుసేనతో హాట్​లైన్స్​, రేడియో కమ్యూనికేషన్​ లైన్లు యాక్టివ్​గా ఉంటాయి. వాటిని చెక్​ చేయాలి. కంట్రోల్​ రూమ్స్​, షాడో కంట్రోల్​ రూమ్స్​ కార్యకలాపాలను, పనితీరును చెక్​ చేయాలి. అవాంఛనీయ, విపత్కర, ప్రతికూల దాడులు సంభవిస్తే తమను తాము కాపాడుకునే విధంగా పౌరులు, విద్యార్థులను ట్రైన్​ చేయాలి.

ఈ సెక్యూరిటీ డ్రిల్​లో భాగంగా 'బ్లాకౌట్స్​' కూడా కనిపించవచ్చు. సాధారణంగా వాయుదాడులు జరిగే సమయంలో ఇలాంటి చర్యలు చేపడతారు. బ్లాకౌట్​ తరహా పరిస్థితులను క్రియేట్​ చేసేందుకు లైట్లు స్విచాఫ్​ చేయాలని అధికారులు ప్రజలను కోరవచ్చు.

సెక్యూరిటీ మాక్ డ్రిల్​లో భాగంగా..​ శత్రువుల కాల్పుల నుంచి కీలక స్థావరాలను (ఎయిర్​ఫీల్డ్​, రిఫైనరీలు, రైల్​ యార్డులు) రక్షించేందుకు, వాటిని కప్పివేస్తారు. తరలింపు ప్రక్రియలను ఎంత మెరుగ్గా, వేగంగా చేపడుతున్నాయో చూసేందుకు రెస్క్యూ టీమ్​లను పరీక్షిస్తారు. దాడి ముప్పు ప్రాంతాల నుంచి పౌరులను వేగంగా, సేఫ్టీ జోన్లకు తరలించడం కూడా మే7, బుధవారం నాడు జరగనున్న ఈ మాక్​ డ్రిల్​లో భాగం. ప్రాథమిక చికిత్స, మంటలు ఆర్పడం, షెల్టర్​ టెక్నిక్స్​ని పౌరులకు కూడా నేర్పిస్తారు.

పహల్గామ్​ ఉగ్రదాడి నేపథ్యంలో..

జమ్ముకశ్మీర్​ పహల్గామ్​లో జరిగిన ఉగ్రదాడిలో 26మంది చనిపోయారు. అప్పటి నుంచి భారత్​- పాక్​ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్థాన్​ని ఆర్థికంగా దెబ్బతీసేందుకు భారత్​ ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది. కానీ భారత్​వైపు నుంచి మిలిటరీ యాక్షన్​ కూడా ఉంటుంది స్వయంగా పాకిస్థాన్​ భావిస్తోంది. అందరు 'యుద్ధం' గురించి మాట్లాడుకుంటున్న వేళ.. 1971 తర్వాత దేశవ్యాప్తంగా మాక్​ డ్రిల్స్​ నిర్వహిస్తుండటం వార్తల్లో నిలిచింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.