Delhi student stabbed: టీచర్ ను కాపాడేందుకు వెళ్లిన విద్యార్థికి కత్తిపోట్లు
Delhi student stabbed: టీచర్ ను కాపాడేందుకు వెళ్లిన ఒక విద్యార్థి కత్తిపోట్లకు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో (Delhi crime) జరిగింది.
Delhi student stabbed: దక్షిణ ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో ఈ ఘటన (Delhi crime) జరిగింది. తన టీచర్ కు, మరో వ్యక్తికి ఘర్షణ జరుగుతుండగా, కాపాడేందుకు వెళ్లిన విద్యార్థుల్లోని ఒకరిపై దుండగుడు కత్తితో దాడి చేశాడు.
ట్రెండింగ్ వార్తలు
Delhi student stabbed: క్లాసెస్ జరగకుండా న్యూసెన్స్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగం విహార్ ప్రాంతానికి చెందిన మహేశ్ స్థానికంగా కోచింగ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఒకటి నుంచి 12వ తరగతి వరకు ట్యూషన్లు చెబుతుంటాడు. ప్రతీ రోజు శిశుపాల్ అనే వ్యక్తి, మరి కొందరితో కలిసి అతడి కోచింగ్ సెంటర్ ఎదురుగా కూర్చుని గందరగోళం చేస్తూ, క్లాసెస్ ను డిస్టర్బ్ చేస్తుండే వాడు. మంగళవారం అలాగే క్లాసెస్ ను డిస్టర్బ్ చేస్తున్న శిశుపాల్ కు సర్ది చెప్పి, అక్కడి నుంచి పంపించివేయడానికి మహేశ్ ప్రయత్నించాడు. అయితే, మహేశ్ ను దుర్భాషలాడుతూ, అతడిపై శిశుపాల్ దాడిచేయడం ప్రారంభించాడు.
Delhi student stabbed: టీచర్ ను కాపాడాలని
దాంతో, అక్కడ క్లాస్ లో ఉన్న విద్యార్థులంతా తమ టీచర్ కు మద్దతుగా ఘర్షణ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు. అదే సమయంలో శిశుపాల్ తమ్ముడు ఒక కత్తిని తీసుకువచ్చి, శిశుపాల్ కు ఇవ్వడంతో, శిశుపాల్ ఆ కత్తితో 17 ఏళ్ల అభిషేక్ అనే విద్యార్థి తలపై విచక్షణారహితంగా పొడిచాడు. దాంతో, అభిషేక్ కింద పడిపోయి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అభిషేక్ ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మహేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, పోలీసులు కేసు నమోదు చేసి, శిశుపాల్ ను అదుపులోకి తీసుకున్నారు.
టాపిక్