Delhi robbery case : నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!-delhi robbery case robbers threw chilli powder in eyes an took rps 45 lakhs ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Robbery Case, Robbers Threw Chilli Powder In Eyes An Took Rps 45 Lakhs

Delhi robbery case : నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!

Sharath Chitturi HT Telugu
Jul 16, 2022 06:49 AM IST

Delhi robbery case : నడిరోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు దోపిడీకి గురయ్యారు. బైక్​ మీద వచ్చిన కొందరు.. బాధితుల కళ్లల్లో కారం చల్లి, వారి వద్ద ఉన్న రూ. 45లక్షలను దోచుకెళ్లారు! ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.

నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!
నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..! (HT Telugu)

Delhi robbery case : దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డు మీద ఇద్దరు దోపిడీకి గురయ్యారు. నిందితులు.. బాధితుల కళ్లల్లో కారం చల్లి.. రూ. 45లక్షలు దోచుకెళ్లారు.

ట్రెండింగ్ వార్తలు

నడిరోడ్డు మీద..

ఢిల్లీలోని డిఫెన్స్​ కాలనీ ఫ్లైఓవర్​ మీద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది ఈ ఘటన. బాధితులు అనిల్​ సింగ్​ యాదవ్​, చతర్​ సింగ్​లు.. స్థానికంగా లోన్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కాగా.. శుక్రవారం సాయంత్రం షాపింగ్​ మాల్స్​లు ఎక్కువగా ఉండే లజ్​పత్​ నగర్​ మార్కెట్​ నుంచి డబ్బులు వసూలు చేశారు. అక్కడి నుంచి చాంద్నీ చౌక్​కు ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో.. వారి ఆటోను రెండు బైక్​లు అడ్డుకున్నాయి. బైక్​ మీద ఉన్న నలుగురు.. ఆటో వద్దకు వచ్చి బాధితుల కళ్లల్లో కారం చల్లారు. నొప్పితో బాధితులు అరిచారు. ఈ క్రమంలోనే వారి వద్ద ఉన్న రూ. 45లక్షలను దోచుకుని అక్కడి నుంచి పరారైయ్యారు. కొన్ని క్షణాల్లోనే అంతా జరిగిపోయింది.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. బాధితుల ఇచ్చిన స్టేట్​మెంట్​ రాసుకున్నారు.

స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్