Delhi robbery case : నడిరోడ్డు మీద.. కళ్లల్లో కారం చల్లి- రూ. 45లక్షలు చోరీ..!
Delhi robbery case : నడిరోడ్డు మీద ఇద్దరు వ్యక్తులు దోపిడీకి గురయ్యారు. బైక్ మీద వచ్చిన కొందరు.. బాధితుల కళ్లల్లో కారం చల్లి, వారి వద్ద ఉన్న రూ. 45లక్షలను దోచుకెళ్లారు! ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది.
Delhi robbery case : దేశ రాజధాని ఢిల్లీలో నడిరోడ్డు మీద ఇద్దరు దోపిడీకి గురయ్యారు. నిందితులు.. బాధితుల కళ్లల్లో కారం చల్లి.. రూ. 45లక్షలు దోచుకెళ్లారు.
ట్రెండింగ్ వార్తలు
నడిరోడ్డు మీద..
ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీ ఫ్లైఓవర్ మీద శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరిగింది ఈ ఘటన. బాధితులు అనిల్ సింగ్ యాదవ్, చతర్ సింగ్లు.. స్థానికంగా లోన్లు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. కాగా.. శుక్రవారం సాయంత్రం షాపింగ్ మాల్స్లు ఎక్కువగా ఉండే లజ్పత్ నగర్ మార్కెట్ నుంచి డబ్బులు వసూలు చేశారు. అక్కడి నుంచి చాంద్నీ చౌక్కు ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో.. వారి ఆటోను రెండు బైక్లు అడ్డుకున్నాయి. బైక్ మీద ఉన్న నలుగురు.. ఆటో వద్దకు వచ్చి బాధితుల కళ్లల్లో కారం చల్లారు. నొప్పితో బాధితులు అరిచారు. ఈ క్రమంలోనే వారి వద్ద ఉన్న రూ. 45లక్షలను దోచుకుని అక్కడి నుంచి పరారైయ్యారు. కొన్ని క్షణాల్లోనే అంతా జరిగిపోయింది.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. బాధితుల ఇచ్చిన స్టేట్మెంట్ రాసుకున్నారు.
స్థానిక సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి, నిందితులను పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.
సంబంధిత కథనం
టాపిక్