Delhi murder case : భర్తను చంపి- 22 ముక్కలుగా నరికిన భార్య.. కొడుకు సాయంతో!
Husband chopped into pieces : ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను చంపిన భార్య.. అతడి శరీరాన్ని 22 ముక్కలుగా నరికింది. కొడుకు సాయంతో వివిధ ప్రాంతాల్లో పడేసింది. శ్రద్ధ వాల్కర్ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ కేసును ఛేదించారు!
Husband chopped into pieces : శ్రద్ధ హత్య కేసు సృష్టించిన అలజడుల నుంచి బయటపడక ముందే.. ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. తన భర్తను హత్య చేసి, శరీరాన్ని 22 ముక్కలుగా నరికేసింది. కుమారుడు సాయంతో.. వాటిని వివిధ ప్రాంతాల్లో పడేసింది. జూన్లో జరిగిన ఈ ఘటనను పోలీసులు తాజాగా పరిష్కరించారు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
అంజన్ దాస్ అనే వ్యక్తి.. భార్య పూనమ్, కుమారుడు దీపక్తో కలిసి తూర్పు ఢిల్లీలోని పాండవ్ నగర్లో నివాసముండేవాడు. అంజన్ దాస్పై భార్యకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉండేవి. అతనికి వివాహేతర సంబంధం ఉందని భావించేది.
Wife kills husband : ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జూన్లో.. కుమారుడు దీపక్తో కలిసి అంజన్ దాస్ను చంపేసింది అతని భార్య. అతనికి నిద్ర మాత్రలు ఇచ్చింది. అంజన్ దాస్ నిద్రలోకి జారుకున్న వెంటనే.. హత్య చేసింది. ఇందుకు కుమారుడు కూడా సాయం చేశాడు. ఆ తర్వాత.. భర్త మృతదేహాన్ని 22 ముక్కలుగా నరికింది పూనమ్. ఆ తర్వాత.. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టారు.
ముక్కలు ముక్కలుగా నరికి భాగాలను.. పడేసేందుకు అనువుగా ఉండే ప్రదేశం కోసం తల్లీకొడుకులు ఉదయం పూట అన్వేషించారు. రాత్రిళ్లు.. ఎవరూ లేని సమయంలో ఒక్కో భాగాన్ని పడేసేవారు.
ఇలా బయటకు..
ఇది జరిగిన కొన్ని రోజులకు.. పాండవ్ నగర్లో ఓ శరీర భాగాన్ని పోలీసులు గుర్తించారు. మర్డర్ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు.. కేసు విషయంలో ముందుకు వెళ్లలేకపోయారు. ఆ శరీర భాగం కుళ్లిపోవడంతో.. అది ఎవరిది? అన్నది తెలుసుకోలేకపోయారు.
Delhi murder case : ఈ ఘటన జరిగిన ఐదు నెలలకు.. శ్రద్ధ వాల్కర్ హత్య కేసు ఢిల్లీలో కలకలం సృష్టించింది. ప్రియుడు అఫ్తాబ్.. శ్రద్ధను హత్య చేసి.. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడని, వాటిని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడన్న వార్తలు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.
Delhi crime news : పాండవ్ నగర్లో దొరికిన ఓ శరీర భాగం.. శ్రద్ధదేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టిన అధికారులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. పాండవ్ నగర్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే.. ఓ యువకడు, ఓ మహిళ.. అర్ధరాత్రి పూట బ్యాగులు మోస్తూ కనిపించారు.
మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జూన్లో నమోదు చేసిన మర్డర్ కేసును పరిష్కరించారు. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. ఓ మహిళ అతడిని చంపేసిందని, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిందని తేలింది. ఈ క్రమంలోనే తల్లీ, కుమారులను పోలీసులు అరెస్ట్ చేశారు.