Delhi murder case : భర్తను చంపి- 22 ముక్కలుగా నరికిన భార్య.. కొడుకు సాయంతో!-delhi murder case woman son arrested for killing husband chopping body into 22 parts ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Delhi Murder Case, Woman Son Arrested For Killing Husband, Chopping Body Into 22 Parts

Delhi murder case : భర్తను చంపి- 22 ముక్కలుగా నరికిన భార్య.. కొడుకు సాయంతో!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 28, 2022 01:45 PM IST

Husband chopped into pieces : ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను చంపిన భార్య.. అతడి శరీరాన్ని 22 ముక్కలుగా నరికింది. కొడుకు సాయంతో వివిధ ప్రాంతాల్లో పడేసింది. శ్రద్ధ వాల్కర్​ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ కేసును ఛేదించారు!

మృతుడి శరీర భాగాలను దాచిన ఫ్రిడ్జ్​.
మృతుడి శరీర భాగాలను దాచిన ఫ్రిడ్జ్​. (ANI)

Husband chopped into pieces : శ్రద్ధ హత్య కేసు సృష్టించిన అలజడుల నుంచి బయటపడక ముందే.. ఢిల్లీలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ.. తన భర్తను హత్య చేసి, శరీరాన్ని 22 ముక్కలుగా నరికేసింది. కుమారుడు సాయంతో.. వాటిని వివిధ ప్రాంతాల్లో పడేసింది. జూన్​లో జరిగిన ఈ ఘటనను పోలీసులు తాజాగా పరిష్కరించారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదీ జరిగింది..

అంజన్​ దాస్​ అనే వ్యక్తి.. భార్య పూనమ్​, కుమారుడు దీపక్​తో కలిసి తూర్పు ఢిల్లీలోని పాండవ్​ నగర్​లో నివాసముండేవాడు. అంజన్​ దాస్​పై భార్యకు ఎప్పటి నుంచో అనుమానాలు ఉండేవి. అతనికి వివాహేతర సంబంధం ఉందని భావించేది.

Wife kills husband : ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జూన్​లో.. కుమారుడు దీపక్​తో కలిసి అంజన్​ దాస్​ను చంపేసింది అతని భార్య. అతనికి నిద్ర మాత్రలు ఇచ్చింది. అంజన్​ దాస్​ నిద్రలోకి జారుకున్న వెంటనే.. హత్య చేసింది. ఇందుకు కుమారుడు కూడా సాయం చేశాడు. ఆ తర్వాత.. భర్త మృతదేహాన్ని 22 ముక్కలుగా నరికింది పూనమ్​. ఆ తర్వాత.. వాటిని ఫ్రిడ్జ్​లో పెట్టారు.

ముక్కలు ముక్కలుగా నరికి భాగాలను.. పడేసేందుకు అనువుగా ఉండే ప్రదేశం కోసం తల్లీకొడుకులు ఉదయం పూట అన్వేషించారు. రాత్రిళ్లు.. ఎవరూ లేని సమయంలో ఒక్కో భాగాన్ని పడేసేవారు.

ఇలా బయటకు..

ఇది జరిగిన కొన్ని రోజులకు.. పాండవ్​ నగర్​లో ఓ శరీర భాగాన్ని పోలీసులు గుర్తించారు. మర్డర్​ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన అధికారులు.. కేసు విషయంలో ముందుకు వెళ్లలేకపోయారు. ఆ శరీర భాగం కుళ్లిపోవడంతో.. అది ఎవరిది? అన్నది తెలుసుకోలేకపోయారు.

Delhi murder case : ఈ ఘటన జరిగిన ఐదు నెలలకు.. శ్రద్ధ వాల్కర్​ హత్య కేసు ఢిల్లీలో కలకలం సృష్టించింది. ప్రియుడు అఫ్తాబ్​.. శ్రద్ధను హత్య చేసి.. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికాడని, వాటిని ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేశాడన్న వార్తలు.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.

Delhi crime news : పాండవ్​ నగర్​లో దొరికిన ఓ శరీర భాగం.. శ్రద్ధదేనా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టిన అధికారులకు షాకింగ్​ విషయాలు తెలిశాయి. పాండవ్​ నగర్​లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడం మొదలుపెట్టారు పోలీసులు. ఈ క్రమంలోనే.. ఓ యువకడు, ఓ మహిళ.. అర్ధరాత్రి పూట బ్యాగులు మోస్తూ కనిపించారు.

మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. జూన్​లో నమోదు చేసిన మర్డర్​ కేసును పరిష్కరించారు. భర్తకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. ఓ మహిళ అతడిని చంపేసిందని, శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేసిందని తేలింది. ఈ క్రమంలోనే తల్లీ, కుమారులను పోలీసులు అరెస్ట్​ చేశారు.

IPL_Entry_Point