Arvind Kejriwal bail : అరవింద్​ కేజ్రీవాల్​కి షాక్​ ఇచ్చిన దిల్లీ హైకోర్టు..!-delhi high court halts release of arvind kejriwal after eds urgent appeal ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arvind Kejriwal Bail : అరవింద్​ కేజ్రీవాల్​కి షాక్​ ఇచ్చిన దిల్లీ హైకోర్టు..!

Arvind Kejriwal bail : అరవింద్​ కేజ్రీవాల్​కి షాక్​ ఇచ్చిన దిల్లీ హైకోర్టు..!

Sharath Chitturi HT Telugu

Arvind Kejriwal Delhi high court : దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కి దిల్లీ హైకోర్టు షాక్​ ఇచ్చింది. ఆయనకు బెయిల్​ని ఇస్తూ ట్రయల్​ కోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేసింది.

దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​.. (HT_PRINT)

Aravind Kejriwal bail :దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. దిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో జైలు ఉన్న ఆయనకు ఓ ట్రయల్​ కోర్టు గురువారం బైయిల్​ మంజూరు చేయగా.. కేజ్రీవాల్​ విడుదలను దిల్లీ హైకోర్టు శుక్రవారం నిలిపివేసింది. కేజ్రీవాల్​ బెయిల్​కి వ్యతిరకంగా ఈడీ సవాలు చేయడమే ఇందుకు కారణం.

దిల్లీ సీఎం కేజ్రీవాల్​.. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు తీహార్​ జైలు నుంచి విడుదలవ్వాల్సి ఉంది. ఆయన్ని కలిసేందుకు.. ఆమ్​ ఆద్మీ పార్టీ నేతలు, కేజ్రీవాల్​ భార్య సునీతాలు జైలు వద్దకు వెళ్లేందుకు ప్లాన్​ చేశారు. కానీ ట్రయల్​ కోర్టు తీర్పుపై అత్యవసర విచారణ జరపాలని దిల్లీ హైకోర్టును కోరింది ఈడీ. ఫలితంగా.. తీహార్​ జైలు నుంచి కేజ్రీవాల్​ విడుదలను కోర్టు నిలిపివేసింది.

Delhi liqour policy scam : రూ. 1లక్ష పూచికొత్తు, పలు నిబంధనలతో కేజ్రీవాల్​కి గురువారం బెయిల్​ని మంజూరు చేసింది ట్రయల్​ కోర్టు. లిక్కర్​ పాలసీ కేసు సాక్షులను ప్రభావితం చేసేందుకు, ఈడీ దర్యాప్తునకు భంగం కలిగించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదని కండీషన్​లు పెట్టి బెయిల్​ ఇచ్చింది.

కానీ.. అరవింద్​ కేజ్రీవాల్​ బయటకు వస్తే, కేసు దర్యాప్తు కచ్చితంగా ప్రభావితం అవుతుందని ఈడీ చెబుతూ వస్తోంది. ఇదే విషయంపై శుక్రవారం.. దిల్లీ హైకోర్టుకు వెళ్లింది. మరి ఈ విచారణలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

“మోదీ ప్రభుత్వం చేస్తున్న రౌడీయిజాన్ని చూడండి. ట్రయల్​ కోర్టు ఆర్డర్​ ఇంకా రాలేదు. ఆదేశాలకు సంబంధించిన కాపీ బయటకే రాలేదు. కానీ మోదీకి చెందిన ఈడీ మాత్రం.. ఏ ఆర్డర్​ని సవాలు చేస్తూ హైకోర్టుకు వెళ్లింది? ఈ దేశంలో అసలేం జరుగుతోంది? మోదీజీ.. న్యాయవ్యవస్థను ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? మొత్తం దేశం చూస్తోంది,” అని సంజయ్​ సింగ్​ అన్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్​ పాలసీ కేసులో మనీ లాండింగ్​ చేశారంటూ.. మార్చ్​ 21ని కేజ్రీవాల్​ని ఈడీ అరెస్ట్​ చేసింది. పాలసీ ద్వారా అక్రమంగా సంపాదించిన సొత్తును.. గోవాలో పార్టీ ప్రచారాలకు వినియోగించుకున్నారని ఆరోపించింది. తాను ఏ తప్పూ చేయాలని ఆయన కోర్టులో వాదించారు.

Aravind Kejriwal latest news : 2024 లోక్​సభ ఎన్నికల కోసం అరవింద్​ కేజ్రీవాల్​కి దాదాపు 15 రోజుల పాటు బెయిల్​ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఎన్నికలు ముగిసిన అనంతరం ఆయన తిరిగి తీహార్​ జైలుకు వెళ్లిపోయారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.