CUET UG 2023 results : సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల-cuet ug 2023 entrance test result announced link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Cuet Ug 2023 Results : సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల

CUET UG 2023 results : సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల

Sharath Chitturi HT Telugu
Updated Jul 15, 2023 03:57 PM IST

CUET UG results : సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల
సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల (PTI)

CUET UG results : సీయూఈటీ యూజీ (కామన్​ యూనివర్సిటీ ఎంట్రెన్స్​ టెస్ట్​- అండర్​గ్రాడ్జ్యుయేట్​) 2023 పరీక్షకు సంబంధించిన ఫలితాలను శనివారం విడుదల చేసింది నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ. 22వేలకుపైగా మంది అభ్యర్థులు 100 పర్సెంటైల్​ను స్కోర్​ చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను cuet.samarth.ac.in లో చెక్​ చేసుకోవాల్సి ఉంటుంది.

దేశంలోని వివిధ కేంద్ర వర్సిటీలు, ప్రైవేట్​ వర్సిటీల్లో ఎంట్రీ కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. కాగా ఈసారి ఇంగ్లీష్​, బయోలజీ, ఎకనామిక్స్​లో టాప్​ స్కోర్లు నమోదయ్యాయి. మొత్తం మీద 11.11 లక్షల మంది విద్యార్థులు ఈ దఫా పరీక్షలను రాశారు. వీరిలో 5,685 మందికి ఇంగ్లీష్​లో 100 పర్సెంటైల్​ వచ్చింది. 4,850మందికి బయోలజీ/ బయోటెక్నాలజీ/ బయోకెమిస్ట్రీలో టాప్​ స్కోర్​ వచ్చింది. ఇక ఎకనామిక్స్​లో 2,836మంది టాప్​ స్కోర్​ సాధించారు.

"ఈక్వి-పర్సెంటైల్​ మెథడ్​ ఆధారంగా ప్రతి ఒక్కరి ప్రదర్శనను ఇవాల్యుయేట్​ చేశాము. కాగా.. నార్మలైజ్​డ్​ మార్కులను పర్సెంటైల్​ ఆధారంగా రూపొందించాము. అభ్యర్థుల రిజిస్ట్రేషన్​, పరీక్ష నిర్వహణ, ఆన్సర్​ కీ విడుదల, ఫైనల్​ ఆన్సర్​ కీ ప్రకటన, ఫలితాలు విడుదల బాధ్యత మాది. కానీ మెరిటల్​ లిస్ట్​ను సంబంధిత వర్సిటీలే రూపొందిస్తాయి," అని ఎన్​టీఏ వెల్లడించింది.

రిజల్ట్స్​ను ఇలా చెక్​ చేసుకోండి..

స్టెప్​ 1:- ముందుగా అధికారిక వెబ్ సైట్ cuet.samarth.ac.in ను ఓపెన్ చేయాలి.

స్టెప్​ 2:- హోం పేజీపై కనిపించే "CUET UG 2023 result" లింక్​పై క్లిక్ చేయాలి.

స్టెప్​ 3:- పుట్టిన రోజు, రిజిస్ట్రేషన్ నెంబర్​ను ఎంటర్ చేసి, లాగిన్ కావాలి.

స్టెప్​ 4:- స్క్రీన్ పై ఫలితాల లిస్ట్ కనిపిస్తుంది.

స్టెప్​ 5:- విద్యార్థి తన రిజల్ట్​ను చెక్ చేసుకుని, ఆ రిజల్ట్ పేజీని డౌన్​లోడ్ చేసుకోవచ్చు.

నెక్స్ట్​ ఏంటి..?

CUET UG 2023 results live updates : అప్లికేషన్ల పరంగా.. దేశంలో రెండో అతిపెద్ద ఎంట్రన్స్​ ఎగ్జామ్​గా నిలిచింది ఈ సీయూఈటీ- యూజీ. గతేడాది జరిగిన తొలి ఎడిషన్​లో 12.5లక్షల మంది రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. నేషనల్​ ఎడ్జ్యుకేషన్​ పాలసీ ఆధారంగా ఈ పరీక్షను నిర్వహిస్తారు. యూజీతో పాటు పీజీ(పోస్ట్​ గ్రాడ్జ్యుయేషన్​)కు వేరువేరుగా ఎగ్జామ్​ ఏర్పాటు చేస్తారు. ఈసారి మే- జూన్​ మధ్యలో వివిధ సెషన్స్​లో పరీక్ష జరిగింది.

ఇక పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత.. ఎంపికైన అభ్యర్థులు వర్సిటీల్లో కౌన్సిలింగ్​ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల అడ్మిషన్​ ప్రక్రియలో అనేక యూనివర్సిటీలు ఈ సీయూఈటీ యూజీ పరీక్ష ఫలితాలను ప్రధానంగా చూస్తున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.