రెండున్నరేళ్ల కూతురిని బాయ్​ఫ్రెండ్​ రేప్​ చేస్తుంటే చూస్తూ కూర్చున్న తల్లి!-crime news mother watches as boyfriend rapes and kills 2 and half year old daughter ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  రెండున్నరేళ్ల కూతురిని బాయ్​ఫ్రెండ్​ రేప్​ చేస్తుంటే చూస్తూ కూర్చున్న తల్లి!

రెండున్నరేళ్ల కూతురిని బాయ్​ఫ్రెండ్​ రేప్​ చేస్తుంటే చూస్తూ కూర్చున్న తల్లి!

Sharath Chitturi HT Telugu

ముంబైలో ఓ రెండున్నరేళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఆ కూతురి తల్లి బాయ్​ఫ్రెండ్​.. ఆ చిన్నారిని రేప్​ చేశాడు. ఆ సమయంలో ఆ మహిళ, ఆ గదిలోనే ఉంది!

ముంబై క్రైమ్​ న్యూస్​..

ముంబైలో అత్యంత పాశవిక, అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ రెండున్నరేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకు గురైంది. తన 19ఏళ్ల బాయ్​ఫ్రెండ్​, కూతురిని రేప్​ చేస్తుండగా ఆమె తల్లి చూస్తూ కూర్చుంది!

అసలేం జరిగిందంటే..

ముంబైలోని మాల్వానీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఆదివారం జరిగింది ఈ ఘటన. ఓ 30ఏళ్ల మహిళకు రెండున్నరేళ్ల కూతురు ఉంది. అంతేకాదు, ఆ మహిళ 19ఏళ్ల యువకుడితో ప్రేమలో ఉంది.

ఆదివారం రాత్రి తల్లి, ఆమె ప్రియుడు చిన్నారిని మాల్వానీ జనకల్యాణ్ నగర్​లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. తన బిడ్డకు మూర్చ వచ్చిందని, ఆ తర్వాత శ్వాస తీసుకోవడం ఆపేసిందని ఆ తల్లి చెప్పింది. అప్పుడే అసలు విషయం బయటపడింది. ఆసుపత్రి వైద్యులు నిర్వహించిన వైద్య పరీక్షల్లో చిన్నారి ప్రైవేట్ పార్ట్స్​పై తీవ్ర గాయాలున్నాయని తేలింది. దీంతో అనుమానం వచ్చి ఆసుపత్రి అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.

ఆసుపత్రికి చేరుకోగానే చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపినట్లు మాల్వానీ పోలీసులు తెలిపారు. రెండు- మూడు గంటల తర్వాత రిపోర్టు వచ్చిందని, ఆమెపై అత్యాచారం జరిగిందని, ఊపిరాడక చనిపోయిందని తేలినట్టు వివరించారు.

పోస్టుమార్టం నివేదిక ఆధారంగా పోలీసులు చిన్నారి తల్లిని, ఆమె ప్రియుడిని పోక్సో చట్టం కింద అరెస్టు చేసి, భారతీయ న్యాయ సంహిత కింద కేసు వేశారు.

ప్రాథమిక విచారణలో కుమార్తెపై బాయ్​ఫ్రెండ్​ అత్యాచారానికి పాల్పిడన సమయంలో తల్లి గదిలోనే ఉన్నట్లు తేలింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాల్వానీలో నివసించే మహిళ మూడేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. అప్పటి నుంచి ఆమె తన తల్లితో కలిసి నివసిస్తుండగా, ఆ యువకుడితో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ రెండేళ్లుగా రిలేషన్​షిప్​లో ఉంటున్నారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​లు వెల్లువెత్తుతుతున్నాయి.

నవీ ముంబైలో రేప్​ కేసు..

ముంబైలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికలపై అత్యాచార ఘటనలు ఆందోళకరంగా మారాయి. ఓ మహిళను ఆమె పొరుగింటి వ్యక్తి రేప్​ చేసిన ఘటన నవీ ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్ట్​ చేశారు.

ఏప్రిల్ 30వ తేదీన ఈ ఘటన జరింది. ఏదో పని నెపంతో నిందితుడు తనను తన ఇంటికి పిలిపించుకుని బలవంతం చేశాడని బేలాపూర్​కు చెందిన మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎన్​ఆర్​ఐ సగ్రి పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.

అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్లు 64 (1), 351 (1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారి వెల్లడించారు.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.