మే నెలలో ఇప్పటివరకు కేరళలో 182 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దాంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేరళ ప్రభుత్వం కోరింది. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్నందున మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ అన్నారు. "ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇతర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయని, మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది’’ అని జార్జ్ పేర్కొన్నారు.
ఎర్నాకుళం (34), తిరువనంతపురం (30) తర్వాత కొట్టాయంలో అత్యధికంగా 57 కేసులు నమోదయ్యాయని మంత్రి జార్జ్ తెలిపారు. రాష్ట్ర స్థాయి నిఘాను ముమ్మరం చేశామని, సంక్రమణ ధోరణులు, ఆసుపత్రిలో చేరే రేటు రెండింటినీ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని జార్జ్ తెలిపారు.
హాంకాంగ్, సింగపూర్, థాయ్లాండ్ లలో ఇన్ఫెక్షన్ల పెరుగుదలతో ఈ నెలలో కేరళలో మొత్తం కోవిడ్ కేసులు 250 దాటాయి. ప్రస్తుతం ఆగ్నేయాసియాలో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ ఉప వేరియంట్లు జేఎన్.1, ఎల్ఎఫ్.7, ఎన్బీ 1.8 త్వరగా వ్యాప్తి చెందుతాయి కానీ, తేలికపాటి లక్షణాలను కలిగిస్తాయని జార్జ్ వివరించారు.
జలుబు, గొంతునొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించిన వారు మాస్కులు ధరించాలని కేరళ ప్రభుత్వం సూచించింది.
2. ఆస్పత్రులకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి.
3. గర్భిణులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని సూచించారు.
4. హెల్త్కేర్ వర్కర్లు డ్యూటీలో ఉన్నప్పుడు తప్పనిసరిగా మాస్క్లు ధరించాలి.
5. టెస్టింగ్, సన్నద్ధతపై మార్గదర్శకాలు జారీ చేసింది.
6. లక్షణాలున్న వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించాలని, టెస్టింగ్ కిట్లు, రక్షణ సామగ్రిని తగినంతగా సరఫరా చేయాలని ఆస్పత్రులను ఆదేశించారు.
ఆసియా దేశాలలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు భారతీయ రాష్ట్రాల్లో అత్యధిక క్రియాశీల కేసులు నమోదయ్యాయయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా మొత్తం 257 యాక్టివ్ కేసులు ఉండగా, కేరళలో 95 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 56, తమిళనాడులో 66 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. పుదుచ్చేరి, ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, సిక్కిం, హర్యానా, కర్ణాటక, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు నమోదయ్యాయి.
మే 12 నుండి, భారతదేశం అంతటా మొత్తం 164 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధికంగా 69, మహారాష్ట్రలో 44, తమిళనాడులో 33 కొత్త కేసులు నమోదయ్యాయి. మే 12 నుంచి కోవిడ్ నిర్ధారణ అయిన 112 మంది రోగులు కోలుకొని, డిశ్చార్జ్ అయ్యారని మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.
కేసుల పెరుగుదలపై నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ఎమర్జెన్సీ మెడికల్ రిలీఫ్ డివిజన్, డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెల్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల నిపుణులు హెల్త్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. భారత్ లో ప్రస్తుత కోవిడ్-19 పరిస్థితి అదుపులోనే ఉందని సమావేశం తేల్చింది. ‘‘మే 19, 2025 నాటికి, భారతదేశంలో క్రియాశీల కోవిడ్ -19 కేసుల సంఖ్య 257 గా ఉంది, ఇది దేశం యొక్క పెద్ద జనాభాను పరిగణనలోకి తీసుకుంటే చాలా తక్కువ సంఖ్య. ఈ కేసులన్నీ తేలికపాటివి, ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు" అని ఒక అధికారిని తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఇద్దరు రోగులు మరణించినట్లు మహారాష్ట్ర రాష్ట్ర ఆరోగ్య శాఖ మంగళవారం ఒక పత్రికా ప్రకటనలో ధృవీకరించింది. వీరిద్దరికీ ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి.జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 6,066 స్వాబ్ శాంపిల్స్ను పరీక్షించగా 106 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వీరిలో 101 మంది ముంబైకి చెందినవారు కాగా, మిగిలిన వారు పుణె, థానే, కొల్హాపూర్ కు చెందినవారు. దక్షిణ కొరియా, సింగపూర్, చైనా, థాయ్లాండ్ వంటి ఆసియా దేశాలతో సహా ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగాయి.
సంబంధిత కథనం