MP Santokh Singh death : భారత్ జోడో యాత్రలో విషాదం.. గుండెపోటుతో ఎంపీ మృతి!
Congress MP Santokh Singh Chaudhary death : పంజాబ్లో జరగుతున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్.. గుండెపోటుతో మరణించారు. ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయానికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధ్రువీకరించారు.
Congress MP Santokh Singh Chaudhary death : పంజాబ్లో కొనసాగుతున్న భారత్ జోడో యాత్రలో శనివారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోష్ సింతోఖ్ సింగ్ చౌదరి.. గుండెపోటుతో మరణించారు.
ట్రెండింగ్ వార్తలు
ఒక్కసారిగా కుప్పకూలిన సంతోఖ్ సింగ్..
శనివారం ఉదయం ఫిల్లౌర్ ప్రాంతం నుంచి భారత్ జోడో యాత్రను ప్రారంభించారు రాహుల్ గాంధీ. వందలాది మంది కార్యకర్తలు, పార్టీ నేతలు, ఎంపీలు.. రాహుల్ గాంధీతో కలిసి నడిచారు. జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి కూడా యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఈ ఘటనను చూసిన రాహుల్ గాంధీ.. ఆయన వద్దకు వెళ్లారు. అంబులెన్స్ కూడా వచ్చింది.
Santokh Singh Chaudhary death : కొద్ది క్షణాల్లోనే.. సంతోఖ్ సింగ్ను అంబులెన్స్లో ఫగ్వారాలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాగా.. గుండెపోటు కారణంతో మార్గం మధ్యలోనే సంతోఖ్ సింగ్ మరణించినట్టు అధికారులు ధ్రువీకరించారు.
సంతోఖ్ సింగ్ మరణం నేపథ్యంలో భారత్ జోడో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
సంతోఖ్ సింగ్కు నివాళులు..
santokh Singh Chaudhary Bharat Jodo Yatra : సంతోఖ్ సింగ్ అకాల మరణంపై రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
"కాంగ్రెస్ జలంధర్ ఎంపీ సంతోఖ్ సింగ్ మరణ వార్త విని చాలా బాధ కలిగింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను," అని పంజాబ్ సీఎం భగవంత్ మన్ ట్వీట్ చేశారు.
"ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి జీ అకాల మరణ వార్త విని బాధపడ్డాను. గుండెపోటుతో శనివారం ఉదయం ఆయన మరణించారు. ఈ కష్టకాలంలో ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను," అని మాజీ కాంగ్రెస్ సభ్యుడు అమరిందర్ సింగ్ ట్వీట్ చేశారు.
Bharat Jodo Yatra Punjab : "ఎంపీ శ్రీ సంతోఖ్ సింగ్ చౌదరి మరణ వార్త విని షాక్కు గురయ్యాను. పార్టీకి ఆయన మరణ వార్త పెద్ద దెబ్బలాంటిది. ఈ దుఖంలో ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి," అని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే.
సంబంధిత కథనం