China road accident : ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం-china road accident 17 killed 22 injured in jiangxi province ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  China Road Accident 17 Killed, 22 Injured In Jiangxi Province

China road accident : ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 08, 2023 08:23 AM IST

China road accident : చైనాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో 17మంది మరణించారు. 22మంది గాయపడ్డారు.

ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం
ఘోర రోడ్డు ప్రమాదంలో 17మంది దుర్మరణం (HT_PRINT)

China road accident : చైనాలో ఘోర ట్రాఫిక్​ ప్రమాదం చోటుచేసుకుంది. తూర్పు చైనాలోని జియాంగ్సీ రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనలో 17మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 22మంది గాయపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

అసలేం జరిగింది..?

"నాన్​చంగ్​ కౌంటీలో శనివారం అర్థరాత్రి 1 గంట సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు గల కారణాలు తెలియలేదు. కానీ ఈ ప్రమాదంలో 17మంది మరణించారు. 22మంది గాయాల పాలయ్యారు. వీరిని ఆసుపత్రికి తరలించారు," అని ప్రభుత్వ ఆధారిత మీడియా వెల్లడించింది.

అయితే.. పొగమంచు కారణంగా వెలుతురు లేమితో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Jiangxi road accident : ఈ ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత.. నాన్​చంగ్​ కౌంటీ ట్రాఫిక్​ పోలీసులు.. ప్రజలకు సూచనలు జారీ చేశారు. ఆ ప్రాంతాన్ని పొగమంచు కప్పేసిందని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

"పొగమంచు కారణంగా రోడ్లు కనిపించడం లేదు. విజిబులిటీ తక్కువగా ఉంది. ఫలితంగా ట్రాఫిక్​ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. నిదానంగా డ్రైవింగ్​ చేయాలి. మీ ముందు కారుతో కాస్త గ్యాప్​ మెయింటైన్​ చేయండి. ఓవర్​టేకింగ్​, లేన్​లు మాటిమాటికి మార్చడం వంటి పనులు చేయకండి," అని నాన్​చంగ్​ ట్రాఫిక్​ అధికారులు వెల్లడించారు.

China road accident latest updates : చైనాలో రోడ్డు భద్రత అత్యంత దారుణం! అందుకే ఆ దేశంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. గత నెలలో పొగమంచు కారణంగా.. ఓ ప్రధాన హైవే మీద 100కుపైగా వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కానీ ట్రాఫిక్​ను నియంత్రించేందుకు అధికారులు చాలా కష్టపడ్డారు. పరిస్థితిని సాధారణ స్థాయికి తీసుకొచ్చేందుకు గంటల తరబడి శ్రమించారు.

China traffic accident today : ఇక గతేడాది సెప్టెంబర్​లో గుయిజౌ రాష్ట్రంలో ఓ బస్సు తిరగబడి 27మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇండియాలోనూ..

Road accidents in India : ఇండియాలోను రోడ్డు ప్రమాదాలు ఎక్కువగానే ఉన్నాయి. 2021 సంవత్సరానికి గానూ రోడ్డు ప్రమాదాల వివరాలను ‘రోడ్ యాక్సిడెంట్స్ ఇన్ ఇండియా -2021’ పేరుతో రూపొందించిన ఒక నివేదికను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఆ సంవత్సరం డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్స్ వాడడం వల్ల మొత్తంగా 1997 రోడ్డు ప్రమాదాలు జరిగాయిని తెలిపింది. ఈ యాక్సిడెంట్స్ లో మొత్తం 1040 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది.

మొత్తం మీద.. 2021లో 4,12,432 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఆ ప్రమాదాల్లో 1,53,972 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,84,448 మంది గాయాలపాలయ్యారు.

WhatsApp channel

సంబంధిత కథనం