ముస్సోరీ: రాత్రిపూట కురిసిన అడపాదడపా వర్షం కారణంగా బద్రీనాథ్, కేదార్నాథ్ మార్గాల్లో చార్ ధామ్ యాత్రకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల పర్యాటకులు కొన్ని గంటలపాటు ట్రాఫిక్లో చిక్కుకుపోవాల్సి రావడంతో రోడ్లు క్లియర్ అయ్యే వరకు యాత్రను ఆపాలని యంత్రాంగం నిర్ణయించింది.
మంగళవారం తెల్లవారుజామున బద్రీనాథ్ హైవేలోని కరణ్ప్రయాగ్ సమీపంలో గల గల్నౌ వద్ద రోడ్డుపై భారీ బండరాయి పడిపోయింది.
గుజరాత్కు చెందిన శాంతి బెన్ యాత్రికుడు మాట్లాడుతూ ‘బండరాళ్లు పడిపోయిన కారణంగా ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. రహదారిని క్లియర్ చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం కోసం వేచి ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత మేం బద్రీనాథ్కు మా ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించాం..’ అని వివరించారు.
చమోలీ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి ఎన్.కె.జోషి మాట్లాడుతూ ‘జేసీబీ మెషీన్ల సహాయంతో బండరాయిని తొలగించారు. ఆ తర్వాత యాత్ర తిరిగి ప్రారంభమైంది..’ అని వివరించారు.
హనుమాన్ చట్టి సమీపంలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై బల్డోడా వద్ద భారీ బండరాయి పడిపోవడం, జోషిమఠ్ సమీపంలోని లంబాగడ్ నుల్లాలో వర్షపు నీరు ప్రవహించడంతో ట్రాఫిక్ కదలికలకు అంతరాయం ఏర్పడింది.
చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ హిమాన్షు ఖురానా మాట్లాడుతూ ‘బద్రీనాథ్ జాతీయ రహదారిపై హనుమాన్ చట్టి ముందు బల్డోడా వద్ద రాళ్లు పడటం, లంబగడ్ నుల్లాలో నీటి మట్టం పెరగడంతో, బద్రీనాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే యాత్రికులను పిపాల్కోటి, చమోలి, నందప్రయాగ్, కరంద్ప్రయాగ్, గౌచర్, గోవింద్ఘాట్ వద్ద నిలిపివేశారు. ఆహారం, ఇతర సేవలను ప్రభుత్వ యంత్రాంగం అందించింది..’ అని తెలిపారు.
కేదార్నాథ్ వద్ద గౌరీకుండ్ ఘోడా స్టాప్ సమీపంలో మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బండరాయి పడిపోవడంతో పాదచారుల మార్గం మూసుకుపోయింది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డిఆర్ఎఫ్) నేతృత్వంలోని బృందం సంఘటనా స్థలానికి చేరుకుని శిథిలాలను తొలగించిన తర్వాత యాత్రను పునఃప్రారంభించారు.
రుద్రప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ ‘గౌరీకుండ్ ఘోడా స్టాప్ సమీపంలోని కొండపై నుండి రాళ్ళు పడటంతో కేదార్నాథ్ యాత్ర మార్గం బ్లాక్ అయ్యింది. అక్కడ మోహరించిన ఎస్డీఆర్ఎఫ్ బృందం శిధిలాలను తొలగించింది..’ అని వివరించారు.
అదే ప్రాంతంలో పదేపదే కొండచరియలు విరిగిపడుతున్నట్లు వస్తున్న నివేదికల కారణంగా యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు తెలిపారు.
మంగళవారం ఉదయం వాతావరణం సానుకూలంగా ఉండడంతో 100 కంటే ఎక్కువ యాత్రికుల వాహనాలను బద్రీనాథ్ ప్రాంతం వైపు అనుమతించినట్లు జిల్లా అధికారులు తెలిపారు.
ఢిల్లీ నుండి బద్రీనాథ్కు వెళుతున్న యాత్రికుడు గిరీష్ సింగ్ మాట్లాడుతూ.. ‘మేం రాత్రిపూట వర్షంలో చిక్కుకున్నాం. మమ్మల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాత్ర పునఃప్రారంభం కోసం వేచి ఉన్నందున పండ్లు, బిస్కెట్లు, నీరు మొదలైనవి అందించారు.." అని తెలిపారు.
కాన్పూర్కు చెందిన మరో యాత్రికుడు సుమిత్ అవస్థి మాట్లాడుతూ ‘వాతావరణ పరిస్థితుల గురించి మాకు అవగాహన కల్పించి ఉంటే బాగుండేది. రిషికేశ్ లేదా ఏదైనా పెద్ద పట్టణం సమీపంలో వాతావరణ సూచన వివరాలను అందజేసి ఉంటే బాగుండేది. తద్వారా వర్షం పడుతున్నప్పుడు అక్కడ ఆగిపోవచ్చు..’ అని అన్నారు.
కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, రోడ్డుపై శిథిలాలు పడిన సందర్భాల్లో జాప్యం లేకుండా రోడ్డును క్లియర్ చేసేలా జేసీబీ యంత్రాలను ఏర్పాటు చేయాలని జాతీయ రహదారి అధికారులను చమోలి, కేదార్నాథ్ జిల్లా మెజిస్ట్రేట్లు ఆదేశించారు.
రుద్ర ప్రయాగ్ జిల్లా మేజిస్ట్రేట్ మయూర్ దీక్షిత్ మాట్లాడుతూ ‘కేదార్నాథ్ పుణ్యక్షేత్రాన్ని ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా భక్తులు సందర్శించారు. ఇది ఒక రికార్డు..’ అని పేర్కొన్నారు.
టాపిక్