Chandrayaan-3 latest news : స్లీప్​ మోడ్​లోకి ప్రగ్యాన్​.. రోవర్​ పరిశోధనలు పూర్తి!-chandrayaan3 rover completes its walk scientists analyzing data looking for signs of frozen water ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Chandrayaan-3 Latest News : స్లీప్​ మోడ్​లోకి ప్రగ్యాన్​.. రోవర్​ పరిశోధనలు పూర్తి!

Chandrayaan-3 latest news : స్లీప్​ మోడ్​లోకి ప్రగ్యాన్​.. రోవర్​ పరిశోధనలు పూర్తి!

Sharath Chitturi HT Telugu

Chandrayaan-3 latest news : ప్రగ్యాన్​ రోవర్​.. స్లీప్​ మోడ్​లోకి జారుకుంది. ఇందుకు గల కారణాన్ని ఇస్రో వెల్లడించింది.

పని పూర్తి చేసిన ప్రగ్యాన్​.. స్లీప్​ మోడ్​లోకి రోవర్​! (PTI)

Chandrayaan-3 latest news : చంద్రయాన్​-3 మిషన్​పై మరో కీలక అప్డేట్​ ఇచ్చింది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. గత నెల 23 నుంచి చంద్రుడి ఉపరితలంపై తిరుగుతున్న ప్రగ్యాన్​ రోవర్​.. తన పనిని విజయవంతంగా పూర్తి చేసిందని స్పష్టం చేసింది. తాజాగా.. ఈ రోవర్​ను స్లీప్​ మోడల్​లో పెట్టినట్టు వెల్లడించింది.

కారణం ఇదే..

చంద్రుడి సౌత్​ పోల్​లో సూర్య రశ్మి తగ్గుముఖం పడుతోంది. మరో 14 రోజుల పాటు అక్కడ వెలుతురు ఉండదు. అందుకే రోవర్​ను స్లీప్​ మోడ్​లో పెట్టాలని ఇస్రో శాస్త్రవేత్తలు నిర్ణయించుకున్నారు.

Pragyan rover news : "ప్రగ్యాన్​ రోవర్​.. తన అసైన్​మెంట్​ను పూర్తి చేసుకుంది. దానిని సేఫ్​గా పార్క్​ చేశాము. స్లీప్​ మోడ్​లో పెట్టాము. రోవర్​లోని పేలోడ్స్​ని కూడా ఆఫ్​ చేశాము. ఇప్పటివరకు రోవర్​ సేకరించిన డేటా మొత్తాన్ని విక్రమ్​ ల్యాండర్​ సాయంతో భూమికి ట్రాన్స్​మీట్​ చేశాము," అని ఇస్రో స్పష్టం చేసింది.

ఆగస్ట్​ 23 నుంచి 14 రోజుల పాటు పనిచేసే విధంగా ప్రగ్యాన్​ రోవర్​ను రూపొందించింది ఇస్రో.

"ప్రస్తుతం రోవర్​ బ్యాటరీ ఫుల్​గా ఉంది. 2023 సెప్టెంబర్​ 22 నుంచి మళ్లీ అక్కడ సూర్యుడి ఖాంతి పడొచ్చు. ఆ తర్వాత రోవర్​ను యాక్టివేట్​ చేసి, మరిన్ని అసైన్​మెంట్స్​ చేపట్టాలని ఆశిస్తున్నాము," అని ఇస్రో స్పష్టం చేసింది.

Pragyan rover latest news : అయితే.. చంద్రుడిలో రాత్రి అయినప్పుడు, అక్కడి ఉష్ణోగ్రతలు మైనస్​ 120 డిగ్రీలకు కూడా చేరే అవకాశం ఉంటుంది. దీనిని తట్టుకునే శక్తి చంద్రయాన్​-3లోని ఎలక్ట్రానిక్​ పరికరాలకు లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్య ఖాంతి మళ్లీ తాకేసరికి.. రోవర్​ యాక్టివేట్​ అవుతుందా? లేదా? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది.

నీటి జాడ ఉందా?

అయితే రోవర్​ పంపించిన డేటాలో నీటి జాడ ఉందా? లేదా? అన్న విషయంపై ఇస్రో ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంపై సంచలన ప్రకటన చేస్తే.. ఇస్రో చేపట్టిన చంద్రయాన్​-3 మిషన్​ సంచలనం సృష్టించినట్టే. అయితే.. సల్ఫర్​తో పాటు ఇతర ఖనిజాలను రోవర్​ కనుగొందని కొన్ని రోజుల క్రితమే వెల్లడించింది ఇస్రో. అల్యుమీనియం, ఐరన్​, కాల్షియం, క్రోమియం, టిటానియం, మాంగనీస్​, ఆక్సీజన్​, సిలికాన్​ వంటివి చంద్రుడి ఉపరితలంపై రోవర్​ డిటెక్ట్​ చేసిందని పేర్కొంది.

ఆదిత్య ఎల్​1 లాంచ్​ సక్సెస్​..

Aditya L1 launch : చంద్రయాన్​-3 తర్వాత.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్​1 లాంచ్​ సక్సెస్​ అయ్యింది. శనివారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు.. ఆదిత్య ఎల్​1ను మోసుకెళుతూ నింగిలోకి ఎగిరింది పీఎస్​ఎల్​వీ రాకెట్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.