MSP For Kharif crops: 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం-centre clears minimum support price for 14 kharif crops ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Msp For Kharif Crops: 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం

MSP For Kharif crops: 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం

HT Telugu Desk HT Telugu

కేంద్ర ప్రభుత్వం బుధవారం 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్ధతు ధరల పెంపు ప్రతిపాదనను ఆమోదించింది.

14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం (HT_PRINT)

14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జూన్ 19న జరిగిన కేబినెట్ సమావేశంలో ఎంఎస్పీ తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల సంక్షేమం కోసం కనీస మద్ధతు ధరపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో, 14 పంటలకు కనీస మద్ధతు ధరను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

వరి మద్ధతు ధర రూ. 2,300

‘‘వరి ధాన్యానికి కనీస మద్ధతు ధరను క్వింటాల్ కు రూ .2,300 గా నిర్ణయించారు. ఇది మునుపటి ఎంఎస్పీ కంటే రూ .117 ఎక్కువ’’ పెరిగింది" అని వైష్ణవ్ చెప్పారు. 14 ఖరీఫ్ పంటలకు ఎంఎస్పీ పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులకు సుమారు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూరుతుందని వైష్ణవ్ తెలిపారు. గత సీజన్ కంటే ఇది రూ.35,000 కోట్లు ఎక్కువని చెప్పారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.