ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు; ప్రయాణికుడి అరెస్ట్-bomb scare on mumbai bound indigo flight at kolkata airport diverted to the isolation bay ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు; ప్రయాణికుడి అరెస్ట్

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు; ప్రయాణికుడి అరెస్ట్

Sudarshan V HT Telugu

విమానంలో బాంబు ఉందని ఓ ప్రయాణికుడు చెప్పడంతో భద్రతా తనిఖీల కోసం ఆ విమానాన్ని కోల్కతా విమానాశ్రయంలో ఐసోలేషన్ కు తరలించారు. అనంతరం, బాంబు ఉందన్న 26 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు (REUTERS)

కోల్కతా నుంచి ముంబైకి వెళ్తున్న ఇండిగో విమానాన్ని మంగళవారం మధ్యాహ్నం కోల్ కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఐసోలేషన్ బేకు మళ్లించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడంతో విమానం బయల్దేరడంలో జాప్యం జరిగింది.

మణిపూర్ ప్రయాణికుడు

ఇంఫాల్ నుంచి ముంబైకి కోల్ కతాలో స్టాప్ ఓవర్ తో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడు స్టెప్ లాడర్ పాయింట్ చెక్ గా పిలిచే సెకండరీ లెవల్ సెక్యూరిటీ ప్రొసీజర్ సమయంలో ఇండిగో సెక్యూరిటీ ఆఫీసర్ ముందు 'బాంబు' అనే పదాన్ని ఉచ్చరించడంతో ముందు జాగ్రత్త చర్యగా విమానంలో విస్తృత తనిఖీలు చేశారు. విమానం దగ్గర, విమానం ఎక్కేముందు ప్రయాణికులను, హ్యండ్ లగేజ్ ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. దీన్నే సెకండరీ లెవెల్ సెక్యూరిటీ చెక్ అంటారు. ఈ సమయంలో ఇంఫాల్ కు చెందిన ఆ ప్రయాణికుడు బాంబు అన్న మాట వాడడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

ప్రయాణికుడి అరెస్ట్

ప్రయాణికుడి మాటను నిర్దిష్టమైనదిగా నిర్ణయించి భద్రతను కట్టుదిట్టం చేశారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అమలు చేశారు" అని విమానాశ్రయ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ చెప్పారు. 26 ఏళ్ల వ్యక్తిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ నిమిత్తం పోలీసులకు అప్పగించారు. ఇంఫాల్ నుంచి ఇండిగో విమానంలో కోల్కతాకు వచ్చిన ఆ ప్రయాణికుడు ముంబైకి మరో ఇండిగో విమానం ఎక్కాల్సి ఉంది.

ప్రయాణం ఆలస్యం

కోల్ కతా టు ముంబై లెగ్ లో 186 మంది ప్రయాణికులు బుక్ చేసుకోగా, ఈ ఘటన జరిగినప్పుడు 179 మంది అప్పటికే ఇండిగో విమానంలో ఎక్కారు. వాస్తవానికి మధ్యాహ్నం 1.30 గంటలకు బయలుదేరాల్సిన ముంబై వెళ్లాల్సిన ఇండిగో విమానం ఖాళీ చేసి సమగ్ర భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేకు తరలించడంతో ఆలస్యమైంది. భారత్-పాక్ సైనిక ఘర్షణ నేపథ్యంలో దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.