ఆపరేషన్ సింధూర్ మరుసటి రోజే పాకిస్తాన్ లోని లాహోర్ లో భారీ పేలుడు-blast heard in pakistans lahore day after operation sindoor report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఆపరేషన్ సింధూర్ మరుసటి రోజే పాకిస్తాన్ లోని లాహోర్ లో భారీ పేలుడు

ఆపరేషన్ సింధూర్ మరుసటి రోజే పాకిస్తాన్ లోని లాహోర్ లో భారీ పేలుడు

Sudarshan V HT Telugu

పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లక్ష్యంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన మర్నాడే పాకిస్తాన్ లోని ప్రధాన నగరం లాహోర్ లో భారీ పేలుడు సంభవించింది. గురువారం ఉదయం పాకిస్తాన్ లోని లాహోర్ లో పేలుడు సంభవించిందని జియో టీవీ తెలిపింది.

లాహోర్ లో భారీ పేలుడు (PTI)

పాకిస్థాన్ లోని లాహోర్ లో గురువారం ఉదయం అత్యంత భారీ పేలుడు ఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు, ఉగ్రవాద శిక్షణ శిబిరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో వైమానిక దాడులు జరిపిన మరుసటి రోజే ఈ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడుకు గల కారణాలు, మృతుల సంఖ్య తదితర వివరాలు ఇంకా తెలియరాలేదు.

వాల్టన్ విమానాశ్రయం సమీపంలో..

లాహోర్ లోని వాల్టన్ విమానాశ్రయానికి సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాల్లో ఈ పేలుడు శబ్దం వినిపించింది. ఆ వెంటనే సైరన్ మోగడంతో స్థానికులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ప్రాంతం లాహోర్ యొక్క ఆధునిక సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్, లాహోర్ ఆర్మీ కంటోన్మెంట్ కు సమీపంలో ఉంటుంది.

ఆపరేషన్ సిందూర్

పహల్గామ్ మారణకాండకు ప్రతీకారంగా భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని జైషే మహ్మద్, లష్కరే తోయిబా సహా తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను డీప్ స్ట్రైక్ క్షిపణులను ఉపయోగించి ధ్వంసం చేశాయి. మరోవైపు, లాహోర్, ఇస్లామాబాద్ లలోని గగనతలాన్ని పాకిస్తాన్ మూసివేసింది. లాహోర్, ఇస్లామాబాద్ విమానాశ్రయాల్లోని అన్ని వాణిజ్య విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ఎయిర్పోర్ట్స్ అథారిటీ బుధవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కరాచీ విమానాశ్రయం మాత్రం పనిచేస్తోంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.