BJP MP: త్వరలో చెన్నై సింగర్ తో బెంగళూరు బీజేపీ యువ ఎంపీ వివాహం!-bjp mp tejasvi surya set to tie the knot with chennai based singer report ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bjp Mp: త్వరలో చెన్నై సింగర్ తో బెంగళూరు బీజేపీ యువ ఎంపీ వివాహం!

BJP MP: త్వరలో చెన్నై సింగర్ తో బెంగళూరు బీజేపీ యువ ఎంపీ వివాహం!

Sudarshan V HT Telugu

BJP MP: భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు, కర్నాటక నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచిన తేజస్వీ సూర్య వివాహం త్వరలో చెన్నైకి చెందిన ఒక క్లాసికల్ సింగర్ తో జరగబోతోంది. మరికొద్ది నెలల్లో బెంగళూరులో వీరి వివాహ వేడుక జరిగే అవకాశం ఉందని సమాచారం.

BJP MP Tejasvi Surya (HT_PRINT)

BJP MP marriage: భారతీయ జనతా పార్టీ (bjp) ఎంపి తేజస్వి సూర్య చెన్నైకి చెందిన ప్రముఖ శాస్త్రీయ గాయని శివశ్రీ స్కంద ప్రసాద్ ను త్వరలో వివాహం చేసుకోనున్నారు. మరికొద్ది నెలల్లో బెంగళూరులో వీరి వివాహ వేడుక జరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే బెంగళూరు సౌత్ ఎంపీ నుంచి ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

శివశ్రీ వివరాలు.

శివశ్రీ స్కంద ప్రసాద్ శాస్త్ర విశ్వవిద్యాలయం నుండి బయో ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. చెన్నై విశ్వవిద్యాలయం నుండి భరతనాట్యంలో ఎంఏ డిగ్రీ పొందారు. "పొన్నియిన్ సెల్వన్ - పార్ట్ 2" కన్నడ వెర్షన్ లోని ఒక పాటకు కూడా శివశ్రీ తన గాత్రాన్ని అందించారని సమాచారం. శివశ్రీకి 2 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లతో యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. 2014 జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ శివశ్రీ స్కంద ప్రసాద్ ను ప్రత్యేకంగా ప్రశంసించారు. ''కన్నడలో శివశ్రీ స్కందప్రసాద్ పాడిన ఈ గానం ప్రభు శ్రీరామ్ పట్ల భక్తిభావాన్ని చక్కగా తెలియజేస్తుంది. మన గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ఇటువంటి ప్రయత్నాలు ఎంతగానో దోహదపడతాయి" అని ప్రధాని మోడీ ఒక పోస్ట్ లో పేర్కొన్నారు.

సౌత్ బెంగళూరు ఎంపీ

వృత్తిరీత్యా న్యాయవాది అయిన తేజస్వి సూర్య ప్రస్తుతం బీజేపీ తరఫు బెంగళూరు (bengaluru news) దక్షిణ నియోజకవర్గం ఎంపీగా ఉన్నారు. ఆయన 2019 లోక్ సభ ఎన్నికల్లో బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్ పై 3.31 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. 2020 సెప్టెంబర్ నుంచి ఆయన భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు.

ఐరన్ మ్యాన్ 70.3 ఎండ్యూరెన్స్ రేసు

2024లో ఐరన్ మ్యాన్ 70.3 ఎండ్యూరెన్స్ రేసును తేజస్వి సూర్య పూర్తి చేశారు. ఈ కఠిన రేసును విజయవంతంగా పూర్తి చేసిన తొలి సిట్టింగ్ ఎంపీగా ఆయన రికార్డు సృష్టించారు. వచ్చే ఏడాది మరింత దూరాన్ని అధిగమించేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. "ఈ ఏడాది ప్రారంభంలో నేను గోవాలో ఐరన్ మ్యాన్ 70.3 పూర్తి చేశాను. మన మనస్సు, శరీరం ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయో ఆ సమయంలో నాకు అర్థమైంది. ఈ సామర్ధ్యం శారీరకం కంటే మానసికం ఎక్కువ. 2025 రేసుకు సన్నద్ధమయ్యే సుసంపన్నమైన అనుభవం కోసం నేను ఎదురు చూస్తున్నాను. నా పనిలో కూడా నాకు ఉపయోగపడే కొత్త అభ్యాసాలను స్వీకరిస్తాను" అని సూర్య ఐరన్ మ్యాన్ 70.3 గోవా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.