Van falls into dam : డ్యామ్లోకి దూసుకెళ్లిన వ్యాన్.. ఏడుగురు దుర్మరణం
Van falls into dam in Bihar : బీహార్లో జరిగిన ఘోర ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. శివరాత్రి నేపథ్యంలో ఆలయానికి వెళుతుండగా.. ఓ వ్యాన్, డ్యామ్లో పడింది. గాయపడిన 19మందిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
Van falls into dam in Bihar : బిహార్లో ఘోర ప్రమాదం సంభవించింది. రోహ్తాస్ జిల్లాలోని డీఆర్పీ (దుర్గావతి రిజర్వాయర్ ప్రాజెక్ట్) డ్యామ్లోకి ఓ వ్యాన్ పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 19మంది గాయపడ్డారు. వీరిలో 8మంది మహిళలు కూడా ఉన్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
శనివారం మహాశివరాత్రి నేపథ్యంలో.. కైముర్ హిల్స్లోని గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్లేందుకు 26మంది భక్తులు వ్యాన్లో బయలుదేరారు. వీరందరు కరాకట్ ప్రాంతానికి చెందినవారు. కాగా.. శుక్రవారం తెల్లవారుజామున ఆ వ్యాన్.. గైఘాట్ కొండలు ఎక్కుతుండగా ఒక్కసారిగా బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. సంబంధిత వ్యాన్ పక్కనే ఉన్న 70 అడుగుల లోతు గల డ్యామ్లో పడింది.
Bihar accident death toll : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే మూడు మృతదేహాలు బయటకు వచ్చాయి. వ్యాన్ వరకు వెళ్లేందుకు స్థానిక ఈతగాళ్లు శ్రమిస్తున్నారు. మరోవైపు 19మంది క్షతగాత్రులను ససరమ్లోని సదర్ హాస్పిటల్లో చేర్పించారు.
ఘటన జరిగిన సమయంలో డ్యామ్లో 40 అడుగల లోతు మేర నీరు ఉందని, వ్యాన్ అందులో మునిగిపోయిందని డ్యామ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అఫ్జల్ అలామ్ తెలిపారు.
Bihar latest news : మృతదేహాలను అధికారులు ఇంకా గుర్తించలేదు. కాగా.. మృతిచెందిన, గాయపడిన వారు బిహార్ రేడియా, ముహ్వారి, టెలారీ, లఖనౌల్, గేరా, టుర్కి, సకలాబజరాతో పాటు సమీప గ్రామానికి చెందిన ప్రజలను సమాచారం.