భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు-bhagavad gita and natyashastra inscribed in unesco memory of world register pm modi says proud moment ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు.. మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో చోటు

Anand Sai HT Telugu

యునెస్కో తన మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్య శాస్త్రాన్ని కూడా చేర్చింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భారతీయ సంస్కృతీ, వారసత్వానికి మరో గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమెురీ ఆఫ్ వరల్ రిజిస్టర్‌లో చోటు దక్కింది. భారతదేశ కాలాతీత జ్ఞానాన్ని, కళాత్మక ప్రతిభను ఈ ప్రపంచ గౌరవంతో కొనియాడుతోందని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు.

'ఈ గ్రంథాలు భారతదేశ ప్రాపంచిక దృక్పథాన్ని ప్రతిబింబిస్తాయి. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను ప్రపంచం గౌరవిస్తోంది. ఈ గ్రంథాలు భారత ప్రజల ఆలోచనలు, దార్శనికతను ప్రతిబింబిస్తాయి. వీటితో ఈ అంతర్జాతీయ రిజిస్టర్ లో మన దేశానికి చెందిన 14 రికార్డులు చేరాయి.'అని షెకావత్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో ప్రపంచానికి, ప్రపంచ స్థాయికి ఉపయోగపడే డాక్యుమెంట్‌లు ఉంటాయి. ఇంటర్నేషనల్ అడ్వైజరీ కమిటీ సిఫారసు తర్వాత అందులో డాక్యుమెంట్‌కు చోటు కల్పిస్తారు. ఇది డాక్యుమెంట్ ప్రాముఖ్యతను చూపుతుంది.

భరతముని నాట్యశాస్త్రంలో సంగీత ప్రక్రియలతో పాటు అనేక సాహిత్య ప్రక్రియలను సున్నితంగా చెప్పారు. ఇందులో గానం, నృత్యం, కవిత్వం, నాటకం, ఇతర సౌందర్య ప్రక్రియలు ఉన్నాయి. భరతముని నాట్యశాస్త్రం నుండి ఆధునిక కాలంలో అనేక సంగీత వాయిద్యాలు కనుగొనబడ్డాయని చెబుతారు.

అదే సమయంలో భగవద్గీత సనాతన ధర్మం అత్యంత పవిత్రమైన గ్రంథాలలో ఒకటి. అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసి బోధ భగవద్గీత. హిందూవులకు ఇది చాలా పవిత్రమైనది. జీవితసారం ఇందులో ఉంటుంది.

యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధాని మోదీ స్పందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్క భారతీయుడు గర్వించే విషయం. భగవద్గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్‌లో చేర్చడం మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన గుర్తింపు. ఇవి మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొదించాయి. ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.' మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.
జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.