ప్రధాని కార్యక్రమాల కోసం ఆర్​టీసీ బస్సులు.. ప్రజలకు తీవ్ర ఇక్కట్లు!-bengaluru travellers stranded after govt hires 4500 buses for pm s event ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Bengaluru Travellers Stranded After Govt Hires 4500 Buses For Pm's Event

ప్రధాని కార్యక్రమాల కోసం ఆర్​టీసీ బస్సులు.. ప్రజలకు తీవ్ర ఇక్కట్లు!

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Nov 12, 2022 01:57 PM IST

PM Modi visit to Bangalore : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బెంగళూరు ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురైనట్టు తెలుస్తోంది. పీఎం మోదీ పాల్గొన్న ఈవెంట్ల​ కోసం.. అధికార బీజేపీ తమ మద్దతుదారులను తీసుకొచ్చేందుకు దాదాపు 4,500 ఆర్​టీసీ బస్సులను ఉపయోగించినట్టు సమాచారం. అదే సమయంలో పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా, మరికొన్ని దారి మళ్లాయి. ఫలితంగా శుక్రవారం ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.

ప్రధాని కార్యక్రమాల కోసం ఆర్​టీసీ బస్సులు.. ప్రజలకు తీవ్ర ఇక్కట్లు!
ప్రధాని కార్యక్రమాల కోసం ఆర్​టీసీ బస్సులు.. ప్రజలకు తీవ్ర ఇక్కట్లు! ((Photo by Samuel Rajkumar/ Hindustan Times))

PM Modi visit to Bangalore : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక పర్యటన బిజీబిజీగా జరిగింది. తీరిక లేకుండా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాని పరిస్థితేంటో కానీ.. ఆ సమయంలో బెంగళూరు ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది. ఆర్​టీసీ బస్సులు, రైళ్లు లేక.. బెంగళరువాసులు ఉక్కిరబిక్కిరి అయ్యారని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

ఏం జరిగింది?

కర్ణాటక పర్యటన కోసం ప్రధాని మోదీ శుక్రవారం బెంగళూరుకు వెళ్లారు. అక్కడ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీ పాల్గొనే ఈవెంట్ల​కు భారీ సంఖ్యలో మద్దతుదారులను తరలించి, తమ బలాన్ని చాటిచెప్పాలని భావించింది అధికార బీజేపీ. ఇందుకోసం బీఎంటీసీ(బెంగళూరు మెట్రోపాలిటిన్​ ట్రాన్స్​పోర్ట్​ కార్పొరేషన్​), కేఎస్​ఆర్​టీసీకి చెందిన 4,500 బస్సులను వినియోగించింది.

కేఎస్​ఆర్​ రైల్వే స్టేషన్​లో ఉదయం 10 గంటల సమయంలో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ను లాంచ్​ చేశారు ప్రధాని మోదీ. ఆ సమయంలో మెజిస్టిక్​ బస్​ టర్మినస్​ వద్ద సేవలు నిలిచిపోయాయి. నగరంలోనే అత్యంత రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో బస్సులు కదలకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందిపడినట్టు సమాచారం. మరికొన్ని బస్సులు.. రోజూ వెళ్ల మార్గంలో కాకుండా, వేరా ప్రాంతాల్లో తిరిగినట్టు తెలుస్తోంది.

PM Modi Bengaluru events : మొత్తం మీద.. మోదీ ఈవెంట్ల కోసం కర్ణాటక ప్రభుత్వం 2,400 బీఎంటీసీ, 2,100 కేఎస్​ఆర్​టీసీ బస్సులను వాడుకున్నట్టు ఓ నివేదిక పేర్కొంది.

శుక్రవారం బస్సు సేవల్లో మార్పులు ఉంటాయని ప్రజలకు సమాచారం కూడా ఇవ్వలేదని ఆ నివేదిక తెలిపింది. ఫలితంగా చాలా సేపటివరకు బస్సుల కోసం బస్​ స్టాపుల్లో ప్రజలు నిరీక్షిస్తూనే ఉండిపోయారు. ఏం జరిగిందని అధికారులను ప్రజలు ప్రశ్నించగా.. 'కనకదాస జయంతి కావడంతో పబ్లిక్​ హాలీడే ఉంది. ఈ సమయంలో ప్రజలు బస్సులు ఎక్కుతారని అనుకోలేదు,' అని సమాధనం వచ్చింది!

బీఎంటీసీని సిబ్బంది కొరత ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ప్రజల అవసరాలను తీర్చేంత శక్తి బీఎంటీసీకి ఉండటం లేదు. ఇప్పుడు వీఐపీ కల్చర్​తో ప్రజలు మరింత ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. వీఐపీ కల్చర్​తో రోడ్లను బ్లాక్​ చేస్తున్నారని, ఇప్పటికే ట్రాఫిక్​తో అల్లాడిపోతున్న తమకు మరిన్ని సమస్యలు వచ్చిపడుతున్నాయని పలువురు బెంగళూరువాసులు నెట్టింట పోస్టులు పెట్టారు. తమ బాధను నెట్టింట పంచుకుంటున్నారు.

ఇక వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ లాంచ్​ సమయంలో పలు రైళ్లను దారి మళ్లించింది దక్షిణ రైల్వే. అక్కడ కూడా ప్రజలు ఇబ్బందిపడ్డారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం