Bengaluru Metro : బెెంగళూరు ప్రజలపై మరో పిడుగు- భారీగా పెరగనున్న మెట్రో టికెట్​ రేట్లు..!-bengaluru metro travel to get expensive fares set to rise by 45 percent effective from ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Metro : బెెంగళూరు ప్రజలపై మరో పిడుగు- భారీగా పెరగనున్న మెట్రో టికెట్​ రేట్లు..!

Bengaluru Metro : బెెంగళూరు ప్రజలపై మరో పిడుగు- భారీగా పెరగనున్న మెట్రో టికెట్​ రేట్లు..!

Sharath Chitturi HT Telugu
Jan 18, 2025 07:23 AM IST

Bengaluru Metro ticket price hike : బెంగళూరు మెట్రో టికెట్​ ధరలు భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. టికెట్​ రేట్లు 45శాతం వరకు పెరగొచ్చు. దీనిపై శనివారమే ఒక ప్రకటన వెలువడనుందని సమాచారం.

బెంగళూరు మెట్రో టికెట్​ ధరలు పెంపు..
బెంగళూరు మెట్రో టికెట్​ ధరలు పెంపు.. (HT_PRINT)

బెంగళూరు ప్రజలకు మరో షాక్​! ఇప్పటికే బస్సు ఛార్జీల పెంపుతో ఇబ్బందిపడుతున్న నగరవాసులపై బెంగళూరు మెట్రో రూపంలో మరో పిడుగు పడనుంది! బెంగళూరు మెట్రో టికెట్​ ధరలు భారీగా పెరగడం దాదాపు ఖరారైపోయింది. ఈ వ్యవహారంపై ఇంకొన్ని గంటల్లో ఒక ప్రకటన సైతం వెలువడనుందని సమాచారం. మొత్తం మీద నమ్మ మెట్రో టికెట్​ ధరలు 40శాతం నుంచి 45శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

yearly horoscope entry point

బెంగళూరు మెట్రో టికెట్​ ధరలు పెంపు..

మీడియా కథనాల ప్రకారం.. బెంగళూరు మెట్రో టికెట్​ రేట్లను పెంచాలని ప్రభుత్వ కమిటీ చేసిన సిఫార్సును బీఎంఆర్​సీఎల్​ (బెంగళూరు మెట్రో రైల్​ కర్పొరేషన్​ లిమిటెడ్​) ఆమోదించింది. జనవరి 20 నుంచి కొత్త టికెట్​ రేట్లు అమల్లోకి వస్తాయి.

నమ్మ బెంగళూరు టికెట్​ రేట్లు ప్రస్తుతం రూ. 10 నుంచి రూ.60 మధ్యలో ఉన్నాయి. అయితే బేస్​ ప్రైజ్​ పెరగదని, కానీ గరిష్ఠ ధర రూ. 85కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

మెట్రో ద్వారా బీఎంఆర్​సీఎల్​కి రోజుకు రూ. 2 కోట్ల ఆదాయం వస్తోంది. ఇక మెట్రో టికెట్​ ధరల పెంపుతో రోజూ అదనంగా మరో రూ. 80లక్షలు- రూ. 90 లక్షల వరకు ఆదాయం పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు పీక్​ హవర్స్​లో 5శాతం డిస్కౌంట్​ ఇవ్వాలని బీఎంఆర్​సీఎల్​ యోచిస్తోంది. అంతేకాదు ఆదివారాలు, జనవరి 16, ఆగస్ట్​ 15, అక్టోబర్​ 2న కూడా డిస్కౌంట్లు ఇవ్వాలని ప్లాన్​ చేస్తోంది. ఇక స్మార్ట్​కార్డ్స్​ , క్యూఆర్​ కోడ్స్​ ద్వారా టికెట్​లు కొనేవారికి 5శాతం డిస్కౌంట్​ ఇప్పటికే ఉంది.

చివరిగా.. 2017 జూన్​లో బెంగళూరు మెట్రో టికెట్​ రేట్లు పెరిగాయి.

ప్రయాణికుల్లో అసంతృప్తి!

కొన్ని రోజుల క్రితం కర్ణాటక ప్రభుత్వం బస్సు ప్రయాణాల ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఇంధన ధరలు, సిబ్బందిపై వ్యయం పెరగడం వంటి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగిన దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్​కే పాటిల్ తెలిపారు.

బెంగళూరు మెట్రో టికెట్​ ధరల పెంపు వార్తలపై పలువురు ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బస్సు ఛార్జీలు ఇటీవలే పెంచారని, ఇప్పుడు మెట్రో ధరలు కూడా పెరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.