Man Dies During Sex : పనిమనిషితో సెక్స్ చేస్తుండగా గుండెపోటు- వృద్ధుడు మృతి!
Man Dies During Sex : బెంగళూరుకు చెందిన ఓ 67ఏళ్ల వృద్ధుడు.. పనిమనిషి ఇంటికి వెళ్లాడు. ఆమెతో సెక్స్ చేస్తున్న సమయంలో గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయాడు. భయపడిపోయిన ఆ పనిమనిషి.. భర్త, సోదరుడి సాయంతో మృతదేహాన్ని ఎవరూ లేని ప్రాంతంలో పడేసింది.
Man Dies During Sex : ఓ 67ఏళ్ల వృద్ధుడు.. పనిమనిషితో సెక్స్ చేస్తూ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటన బెంగళూరులో వెలుగులోకి వచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే.. తనపై మర్డర్ కేసు వేస్తారనే భయంతో.. ఆ పనిమనిషి మరో ఇద్దరితో కలిసి మృతదేహాన్ని ఎవరూ లేని ప్రాంతంలో పడేసింది.
ట్రెండింగ్ వార్తలు
ఇదీ జరిగింది..
బాలసుబ్రహ్మణ్యం అనే వ్యక్తి బెంగళూరులో నివాసముంటున్నాడు. ఆయనకు తన ఇంటి పనిమనిషితో అఫైర్ ఉంది! ఆమె ఇంటికి తరచుగా వెళుతూ ఉండేవాడు.
కాగా.. బాలసుబ్రహ్మణ్యానికి ఇటీవలే యాంజియోగ్రామ్ చికిత్స జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులకు.. పని మీద బయటకు వెళుతున్నట్టు కుటుంబసభ్యులకు చెప్పి.. పనిమనిషి ఇంటికి వెళ్లాడు.
Bengaluru Man Dies During Sex : సరిగ్గా సెక్స్ చేస్తున్న సమయంలో.. 67ఏళ్ల వృద్ధుడికి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయాడు. కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు విడిచాడు. ఇదంతా చూసిన పనిమనిషి.. భయపడిపోయంది. మర్డర్ కేసు మీద తనను అరెస్ట్ చేస్తారేమో అని ఆందోళనకు గురైంది. వెంటనే భర్తకు, సోదరుడికి ఫోన్ చేసి జరిగినది చెప్పింది.
భర్త, సోదరుడు.. పనిమనిషి ఇంటికి వెళ్లారు. తనకు సాయం చేయాలని వారిని ఆమె వేడుకుంది. ముగ్గరు కలిసి.. వృద్ధుడి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లతో చుట్టి.. జేపీ నగర్లోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు.
Man Dies During Sex with domestic help : వృద్ధుడు.. ఎంతకీ ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో జేపీ నగర్లో ఆ వ్యక్తి మృతదేహం పోలీసులకు కనిపించింది. ఈ క్రమంలోనే వృద్ధుడి కాల్ రికార్డింగ్స్ చూశారు. పనిమనిషిపై అనుమానం వ్యక్తం చేశారు. కాల్ రికార్డింగ్స్ ద్వారా.. ఆయన పనిమనిషి ఇంటికి తరచుగా వెళుతుంటాడని పోలీసులు తెలుసుకున్నారు. పనిమనిషిని విచారించగా.. ఆమె జరిగినది వివరించింది.
"ఓసారి తన ఇంటికి బాలసుబ్రహ్మణ్యం వచ్చాడని.. అక్కడే గుండెపోటుతో మరణించాడని పనిమనిషి చెప్పింది. తనపై మర్డర్ కేసు వేస్తారనే భయంతో.. భర్త, సోదరుడిని సాయం చేయాలని వేడుకుంది. వారందరు కలిసి మృతదేహాన్ని ఎవరూ లేని ప్రాంతంలో పడేశారు," అని పోలీసులు పేర్కొన్నారు.
Bengaluru crime news : ఘటనాస్థలం నుంచి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు పనిమనిషి, ఆమె భర్త, సోదరులపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.
పోస్టుమార్టం రిపోర్టు ఇంకా రాలేదు. అది వచ్చిన తర్వాత.. నిందితులపై చర్యలు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
సంబంధిత కథనం