Nashik bus fire accident : బస్సులో అగ్నిప్రమాదం.. 10మంది దుర్మరణం!
Maharashtra bus accident : మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10మంది మరణించారు. బస్సులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.
Nashik bus fire accident : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నాసిక్లోని ఔరంగాబాద్ రోడ్డులో ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు
ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. శనివారం తెల్లవారుజామున 5:15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎదురుగా ఉన్న ట్రక్ను బస్సు ఢీకొట్టినట్టు సమాచారం. ఆ తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. చివరికి ఆ మంటలు బస్సు మొత్తానికి వ్యాపించినట్టు వెల్లడించాయి.
ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు.
క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు నాసిక్లోని ఆసుపత్రికి తరలించారు.
సంబంధిత కథనం