Nashik bus fire accident : బస్సులో అగ్నిప్రమాదం.. 10మంది దుర్మరణం!-at least 8 people dead after a bus caught fire in maharashtra nashik ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  At Least 8 People Dead After A Bus Caught Fire In Maharashtra Nashik

Nashik bus fire accident : బస్సులో అగ్నిప్రమాదం.. 10మంది దుర్మరణం!

Sharath Chitturi HT Telugu
Oct 08, 2022 07:19 AM IST

Maharashtra bus accident : మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 10మంది మరణించారు. బస్సులో మంటలు చెలరేగినట్టు తెలుస్తోంది.

అగ్నిప్రమాదంలో కాలిపోయిన బస్సు
అగ్నిప్రమాదంలో కాలిపోయిన బస్సు

Nashik bus fire accident : మహారాష్ట్రలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నాసిక్​లోని ఔరంగాబాద్​ రోడ్డులో ఓ బస్సుకు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 38మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే.. శనివారం తెల్లవారుజామున 5:15 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఎదురుగా ఉన్న ట్రక్​ను బస్సు ఢీకొట్టినట్టు సమాచారం. ఆ తర్వాత బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. చివరికి ఆ మంటలు బస్సు మొత్తానికి వ్యాపించినట్టు వెల్లడించాయి.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి పరుగులు తీశారు. ఘటనాస్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమించారు.

క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు నాసిక్​లోని ఆసుపత్రికి తరలించారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం