Congress president pole: ఖర్గే రిజల్ట్ పై ముందే నోరు జారిన రాహుల్ గాంధీ
Congress president pole: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్ర ప్రదేశ్ లో కొనసాగుతుంది. అదే సమయంలో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
Congress president pole: కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే విజయం సాధించారు. అయితే, ఆయన విజయాన్ని పార్టీ ఎన్నికల కమిటీ అధికారికంగా ప్రకటించడాని కన్నా ముందే పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ నోరు జారారు.
ట్రెండింగ్ వార్తలు
Congress president pole: ఖర్గేజీ ని అడగండి..
భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో పాద యాత్ర చేస్తున్నారు. బుధవారం ఆయన స్థానికంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ సందర్భంగా, కొత్త అధ్యక్షుడి ఎన్నిక అనంతరం పార్టీలో మీ పాత్ర ఎలా ఉండబోతోంది? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘పార్టీ అధ్యక్షుడే సుప్రీం. ఆయనే నా పాత్ర ఏమిటనేదది నిర్ణయిస్తారు. అందువల్ల ఖర్గేజీ ని అడగండి’ అని రాహుల్ జవాబిచ్చారు. అయితే, రాహుల్ ఆ సమాధానం ఇచ్చే సమయానికి ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఎన్నిక కాలేదు. కౌంటింగ్ కొనసాగుతోంది. దాంతో, రాహుల్ గాంధీ నోరు జారారని పార్టీ వర్గాలు గుసగుసలాడాయి. రాహుల్ సమాధానం ఇచ్చిన కాసేపటికి, పార్టీ అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నికైనట్లు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది.
Congress president pole: శశి థరూర్ విమర్శలు
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఖర్గే తన ప్రత్యర్థి, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ పై ఘన విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు రాగా, థరూర్ కు 1072 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే, ఈ ఎన్నికలు నిర్వహించిన తీరుపై థరూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, రిగ్గింగ్ జరిగిందనడానికి తన వద్ద ఆధారాలున్నాయని ఆయన ఆరోపించారు. అయితే, ఆ తరువాత, తన ఓటమిని అంగీకరించి, ఖర్గేకు శుభాకాంక్షలు తెలిపారు.