National song of India : వందేమాతరం రాసింది అర్జిత్​ సింగ్​ అట- ఈమెకు సెల్యూట్​ చేయాలి!-arijit singh wrote national song of india womans quiz answer stuns internet ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  National Song Of India : వందేమాతరం రాసింది అర్జిత్​ సింగ్​ అట- ఈమెకు సెల్యూట్​ చేయాలి!

National song of India : వందేమాతరం రాసింది అర్జిత్​ సింగ్​ అట- ఈమెకు సెల్యూట్​ చేయాలి!

Sharath Chitturi HT Telugu

Who wrote National song of India : వందేమాతరం రాసింది ఎవరు? అన్న ప్రశ్నకు అర్జిత్​ సింగ్​ అని సమాధానం ఇచ్చింది ఓ యువతి. ఈ వీడియో ఇప్పుడు వైరల్​ అయ్యింది.

వందేమాతరం రాసింది అర్జిత్​ సింగ్​ అట (X/@Shikhar Sagar)

ప్రముఖ ఇన్​స్టాగ్రామ్​ యూజర్​ రెహాన్​ ఖాన్​.. తన షార్ట్​ ఇంటర్వ్యూస్​తో కంటెంట్​ చేస్తూ ఉంటాడు. ఇటీవలే అతని చేసిన ఓ వీడియో వైరల్​గా మారింది. 'నేషనల్​ సాంగ్​ ఆఫ్​ ఇండియా (జాతీయ పాట)' రాసింది ఎవరు? అని అతను అడిగిన సింపుల్​ ప్రశ్నకు ఎవరూ సమాధనం చెప్పలేకపోయారు. అంతేకాదు.. వందేమాతరం రాసింది అర్జిత్​ సింగ్​ అని ఓ యువతి చెప్పడం గమనార్హం! ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

వందేమాతరం రాసింది అర్జిత్​ సింగ్​!

సోషల్​ మీడియాలో వైరల్​ అయిన వీడియోలో రెహాన్​ ఖాన్​.. రోడ్డు పక్కన యువతను ఒక ప్రశ్న అడుగుతూ కనిపించాడు. జాతీయ పాటను రాసింది ఎవరు? అన్నది ఆ ప్రశ్న. చాలా మంది సమాధానం చెప్పలేకపోయారు. కొందరు.. నేషనల్​ సాంగ్​ ఆఫ్​ ఇండియా రాసింది రవింద్రనాథ్​ ఠాగూర్​ అని అన్నారు. ఇంకొందరు జాతీయ పాట అంటే ఏంటో కూడా తెలియదన్నారు.

వీటన్నింటి మధ్య ఓ యువతి చెప్పిన సమాధానం హైలైట్​గా నిలిచింది. బాలీవుడ్​ ప్రముఖ సింగర్​ అర్జిత్​ సింగ్​, జాతీయ పాటను రాసినట్టు ఆమె చెప్పింది!

ఈ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. తక్కువ సమయంలోనే రెండు లక్షల వ్యూస్​ వచ్చాయి. 1,500 లైక్స్​ కూడా వచ్చాయి. వందేమాతరం రాసింది ఎవరో కూడా తెలియడం లేదని నేటి యువతపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు.

"అర్జిత్​ సింగ్​? పాపం.. బంకిమ్​ చంద్ర ఛట్టర్జీ బాధపడుతుంటారు," అని యూజర్​ కామెంట్​ చేశారు.

"విషాదకర ఘటన! అర్జిత్​ సింగ్​? సీరియస్లీ" అని మరొకరు రాసుకొచ్చారు.

"వందేమాతరం రాసింది బంకిమ్​ చంద్ర ఛట్టర్జీ. 1950 జూన్​ 24న రాజ్యాంగాన్ని అడాప్ట్​ చేసుకున్నారు. వందేమాతరం మన జాతీయ పాట. అర్జిత్​ సింగ్​ పేరు చెప్పావా! దేవుడా..," అని మరొకరు అన్నారు.

"నేటి తరం యువత పరిస్థితి అద్దం పట్టే షాకింగ్​ ఘటన ఇది. జాతీయవాదం లేకుండా, తమ క్యారెక్టర్​ని ఎలా నిర్మించుకోగలరు? ఇలా ఉండి.. సమాజానికి ఎలా సహాయపడగలరు?" అని ఇంకో నెటిజన్​ ఆవేదన వ్యక్తం చేశారు.

"ప్రతిసారి ఇలాంటి వీడియో చూసినప్పుడు.. నన్ను బాగా పెంచారని నాకు సంతోషంగా ఉంటుంది," అని మరొకరు అన్నారు.

"జాతీయ పాటను బంకిమ్​ చంద్ర ఛట్టర్జీ రాశారు. 1896లో జరిగిన ఇండియన్​ నేషనల్​ కాంగ్రెస్​ సెషన్​లో తొలిసారి పాడారు," అని మరొకరు వివరణ ఇచ్చారు.

వందేమాతరం రాసింది అర్జిత్​ సింగ్​ అన్న యువతి సమాధానంపై మీ స్పందన ఏంటి?

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన దృశ్యాలను ఇక్కడ చూడండి.

ఇలాంటి చాలా సంఘటనలు సోషల్​ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్​ అవుతూనే ఉంటున్నాయి. సింపుల్​ సమాధానాలు కూడా మన ప్రజలు చెప్పలేకపోతున్నారు. పైగా అవన్నీ పుస్తకాల్లో ఉన్నవే! చదువుకున్నవే! మరి ఈ పరిస్థితి కారణం ఏంటి అంటారు?

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.