అండమాన్ నికోబార్ దీవుల్లోని గగనతలాన్ని త్రివిధ దళం నిర్వహించిన హై ఆల్టిట్యూడ్ ఆయుధ పరీక్షకు వీలుగా శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి మూడు గంటల పాటు మూసివేశారు. అండమాన్ నికోబార్ కమాండ్ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో మాట్లాడుతూ, "ఈ రోజు మాదిరిగానే, అండమాన్ మరియు నికోబార్ దీవుల చుట్టూ ఉన్న గగనతలాన్ని రేపు, అనగా మే 24వ తేదీ కూడా మూడు గంటలు (ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు) పాటు మూసివేస్తారు. మే 16న ఎయిర్ మెన్ (నోటామ్)కు నోటీసులు జారీ చేశాం. మే 23, 24 తేదీల్లో ఆ సమయంలో అండమాన్ మీదుగా పౌర విమానాలను అనుమతించబోము’’ అని వెల్లడించారు.
అండమాన్ నికోబార్ దీవులపై గరిష్టంగా 500 కిలోమీటర్ల కారిడార్ పొడవున్న గగనతలాన్ని మే 23, 24 తేదీల్లో యూనివర్సల్ టైమ్ కోఆర్డినేటెడ్ యూటీసీ ప్రకారం 01:30 నుంచి 04:30 (భారత కాలమానం ప్రకారం ఉదయం 7 నుంచి 10 గంటలు) వరకు పరిమితం చేయనున్నట్లు నోటామ్ తెలిపింది.
ఈ రోజు హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ ను విజయవంతంగా నిర్వహించామని, రేపు కూడా ఇదే తరహా పరీక్ష నిర్వహిస్తామని ఆ అధికారి తెలిపారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఇది రొటీన్ పద్ధతి అని, గతంలో కూడా ఇలాంటి పరీక్షలు చేశామని చెప్పారు. ఈ హై ఆల్టిట్యూడ్ వెపన్ టెస్ట్ కోసమే గగనతలాన్ని మూసివేశామన్నారు. అండమాన్ నికోబార్ కమాండ్ (ఏఎన్ సీ) భారత్ లో ఉన్న ఏకైక త్రివిధ దళాల కమాండ్.
సంబంధిత కథనం