భారత్, పాక్ మధ్య ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఎదురుకాల్పులు, వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఏప్రిల్ 22న 26 మంది పౌరుల ప్రాణాలను బలిగొన్న పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్ముకశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. అనంతరం, పాక్ డ్రోన్, క్షిపణి దాడులకు ప్రతీకారంగా పెద్ద ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అమూల్ తన యాడ్ ను షేర్ చేసి ప్రజల హృదయాలను గెలుచుకుంది.
భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్తతలు, పాకిస్తాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం నేపథ్యంలో ఈ ప్రకటనను అమూల్ రూపొందించింది. ఈ ప్రకటనలో ఆపరేషన్ సిందూర్ పై బ్రీఫింగ్ ఇచ్చిన భారతీయ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఇద్దరు మహిళా అధికారులకు ఐకానిక్ అమూల్ గర్ల్ సెల్యూట్ చేస్తున్నట్లుగా ఒక చిత్రం ఉంటుంది. ఆ చిత్రం పై భాగంలో “Send them pakking” అనే కోట్, కింది భాగంలో Amul proudly Indian అనే స్టేట్మెంట్ ఉంటుంది.
విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచానికి తెలియజేసిన ఇద్దరు మహిళా అధికారులు. అమూల్ గర్ల్ ఈ విజువల్ లో ఆ ఇద్దరికి సెల్యూట్ చేస్తూ కనిపించారు. ఈ ఫొటోలో అమూల్ అమ్మాయి పోడియంల ముందు నిలబడి మహిళా అధికారులకు సెల్యూట్ చేస్తోంది.
ఎప్పటికప్పుడు వినూత్నంగా, జరుగుతున్న ఘటనలకు స్పందిస్తూ అమూల్ ప్రకటనలు విడుదల చేస్తుంటుంది. ప్రతీ యాడ్ లో అమూల్ బేబీ ఉంటుంది. అమూల్ తాజా ప్రకటన సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. తాజాగా, అమూల్ విడుదల చేసిన యాడ్ కూడా అందరి ప్రశంసలు పొందుతోంది. ఒక నెటిజన్ ఈ యాడ్ ను లవ్లీ అని ప్రశంసించారు. మూడో వ్యక్తి తాము అమూల్ బ్రాండ్ ను ప్రేమిస్తున్నామని తెలిపారు. నాలుగో వ్యక్తి సెల్యూట్ ఎమోజీ ద్వారా తమ స్పందనను తెలియజేశారు.
జమ్మూ, ఉధంపూర్, పఠాన్ కోట్ సైనిక స్థావరాలపై పాక్ జరిపిన క్షిపణి, డ్రోన్ దాడులను భారత రక్షణ దళాలు గురువారం నిర్వీర్యం చేశాయి. అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో ఉన్న జమ్మూ, పఠాన్ కోట్, ఉధంపూర్ సైనిక స్థావరాలను క్షిపణులు, డ్రోన్లతో పాక్ లక్ష్యంగా చేసుకుందని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది. ‘ఎటువంటి నష్టాలు లేవని సాయుధ దళాలు స్పష్టం చేశాయి, "కైనెటిక్ మరియు నాన్ కైనెటిక్ మార్గాలతో ఎస్ఓపి ప్రకారం #IndianArmedForces ద్వారా ముప్పు తటస్థీకరించబడింది." అని పేర్కొంది.
సంబంధిత కథనం