యూపీఎస్సీ చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు-ajay kumar former defence secretary appointed as upsc chairman ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  యూపీఎస్సీ చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

యూపీఎస్సీ చైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శిని నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు

Sudarshan V HT Telugu

కేరళ కేడర్ కు చెందిన 1985 బ్యాచ్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త ఛైర్ పర్సన్ గా నియమించారు. అజయ్ కుమార్ 2019 ఆగస్టు 23 నుంచి 2022 అక్టోబర్ 31 వరకు రక్షణ శాఖ కార్యదర్శిగా పనిచేశారు.

రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) కొత్త ఛైర్ పర్సన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ నియమితులయ్యారు. అజయ్ కుమార్ నియామకాన్ని ప్రకటిస్తూ డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ ఆఫ్ ట్రైనింగ్ మంగళవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 316(1) ప్రకారం డాక్టర్ అజయ్ కుమార్ ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా నియమించారు.

1985 బ్యాచ్ ఐఏఎస్

యూపీఎస్సీ చైర్మన్ గా కేరళ కేడర్ కు చెందిన 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అజయ్ కుమార్ పదవీకాలం ఆయన ఆ పదవి చేపట్టిన నాటి నుంచి ప్రారంభమవుతుందని డీవోపీటీ తెలిపింది. అజయ్ కుమార్ కన్నా ముందు కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్యదర్శి ప్రీతి సుడాన్ యూపీఎస్సీ చైర్మన్ గా ఉన్నారు. ఆమె పదవీ కాలం ఏప్రిల్ 29, 2025 తో ముగిసింది. మనోజ్ సోనీ ఆకస్మికంగా రాజీనామా చేయడంతో యూపీఎస్సీ చీఫ్ గా ప్రీతి సూడాన్ ను 2024 జూలైలో నియమించారు. తన పదవీకాలం ముగియడానికి ముందే రాజీనామా చేయాలని మనోజ్ సోనీ నిర్ణయం తీసుకోవడం వెనుక వ్యక్తిగత కారణాలను పేర్కొన్నారని ఈ విషయం తెలిసిన వారు తెలిపారు.

సోనీ రాజీనామా వివాదం

యూపీఎస్సీ ఛైర్ పర్సన్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు మనోజ్ సోనీ 2017 జూన్ నుంచి 2023 మే వరకు యూపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. యూపీఎస్సీ చీఫ్ గా మనోజ్ సోనీ రాజీనామా రాజకీయ వివాదానికి దారి తీసింది. సోనీ రాజీనామాకు యూపీఎస్సీకి సంబంధించిన కుంభకోణాలతో సంబంధం ఉందా అని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటి నేతలు ప్రశ్నించారు.

పూజ ఖేడ్కర్ వివాదం

పూజా ఖేడ్కర్ తన గుర్తింపును తారుమారు చేయడం ద్వారా అదనపు సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రయత్నాలను మోసపూరితంగా పొందారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో యుపిఎస్సి గత సంవత్సరం వార్తల్లో నిలిచింది. ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారిణిగా పూజా ఖేడ్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ గత ఏడాది జూలైలో రద్దు చేసింది. ఖేడ్కర్ చుట్టూ వివాదం చెలరేగడానికి ముందు జూన్ ప్రారంభంలో సోనీ రాజీనామా చేశారు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.