Gratuity limit: డీఏ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త; గ్రాట్యుటీ పరిమితిని కూడా పెంచిన ప్రభుత్వం-after da government hikes gratuity limit for central govt employees by 25 percent ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Gratuity Limit: డీఏ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త; గ్రాట్యుటీ పరిమితిని కూడా పెంచిన ప్రభుత్వం

Gratuity limit: డీఏ పెంపు తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త; గ్రాట్యుటీ పరిమితిని కూడా పెంచిన ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu

Gratuity limit: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం మరో శుభవార్త తెలిపింది. ఈ ఏడాది మార్చి 7న 4% డీఏ పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా, వారి గ్రాట్యుటీ పరిమితిని కూడా 25% పెంచాలని నిర్ణయించింది. దీంతో గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి పెంపు (Photo: iStockphoto)

Gratuity limit: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7 న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA) ను 4% పెంచింది. ఇప్పుడు, తాజాగా, వారి గ్రాట్యుటీ పరిమితి (Gratuity limit) ని కూడా 25% పెంచాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ఈ సంవత్సరం జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెరిగింది.

రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షలకు

‘‘ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు, సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021 లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు) నిబంధనలు 2021 కింద రిటైర్మెంట్ గ్రాట్యుటీ, అలాగే, డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 25% అంటే రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షలకు పెంచారు. ఈ పెంపు జనవరి 1, 2024 నుండి అమలులోకి వస్తుంది’’ అని సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల విభాగం పెన్షన్ & పెన్షనర్స్ వెల్ఫేర్ కార్యాలయం తెలిపింది. గ్రాట్యుటీ పరిమితి (Gratuity limit) ని పెంచడానికి మొదట ఈ సంవత్సరం ఏప్రిల్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ, అందుకు సంబంధించిన సర్క్యులర్ ను మే 1వ తేదీన నిలిపివేశారు.

వారు మాత్రమే అర్హులు

ఒక యజమాని తన ఉద్యోగికి అతను కంపెనీకి అందించే సేవలకు ప్రతిఫలంగా చెల్లించే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. అయితే ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం కంపెనీలో పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే గ్రాట్యుటీ మొత్తాన్ని ఇస్తారు. జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్ (PF)తో పాటు ఇది కూడా లభిస్తుంది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం, 1972 ద్వారా దీనిని అమలు చేస్తారు.

మార్చిలో డీఏ పెంపు ప్రకటన

అంతకుముందు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA hike), పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) ను 4% పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పెంపుతో వారి డీఏ లేదా డీఆర్ 46% నుంచి 50 శాతానికి పెరిగింది. జనవరి 1, 2024 నుండి ఈ కొత్త డీఏ అమలులోకి వస్తుంది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా రూ.12,868.72 కోట్ల భారం పడుతుంది. అలాగే, ఈ పెంపు వల్ల దేశవ్యాప్తంగా 49.18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుత డియర్నెస్ అలవెన్స్ 50 శాతానికి చేరుకోవడంతో ఇంటి అద్దె భత్యం (HRA), గ్రాట్యుటీకి గరిష్ట పరిమితి రెండూ పెరుగుతాయి. మునుపటి డియర్నెస్ అలవెన్స్ పెంపు 2023 అక్టోబర్లో 42% నుండి 46%కి పెరిగింది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే ఈ పెంపు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.