Prasanna Sankar : వివాహేతర బంధం పెట్టిన చిచ్చు! టెక్​ ఫౌండర్​- భార్య గొడవల్లో నలిగిపోతున్న బిడ్డ..-adultery to abduction rippling founder prasanna sankars explosive allegations ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Prasanna Sankar : వివాహేతర బంధం పెట్టిన చిచ్చు! టెక్​ ఫౌండర్​- భార్య గొడవల్లో నలిగిపోతున్న బిడ్డ..

Prasanna Sankar : వివాహేతర బంధం పెట్టిన చిచ్చు! టెక్​ ఫౌండర్​- భార్య గొడవల్లో నలిగిపోతున్న బిడ్డ..

Sharath Chitturi HT Telugu

Prasanna Sankar : ఓ హెచ్​ఆర్​ టెక్​​ కంపెనీ ఫౌండర్​ ప్రసన్న శంకర్​- ఆయన భార్యతో విడాకులు తీసుకుంటున్నారు. కాగా, వీరు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై ఇప్పుడు సోషల్​ మీడియాకు ఎక్కింది.

ప్రసన్న శంకర్​

రిప్లింగ్​ అనే హెచ్​ఆర్​ టెక్​​ కంపెనీ ఫౌండర్​ ప్రసన్న శంకర్​- ఆయన భార్య మధ్య ఉన్న గొడవలు ఇప్పుడు సోషల్​ మీడియాకు ఎక్కాయి! విడాకులు తీసుకుంటున్న సమయంలో వీరిద్దరు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకున్నారు. కాగా తన భార్య దివ్య శశిధర్​ చేసిన ఆరోపణలను శంకర్​ సోషల్​ మీడియా వేదికగా తిప్పికొట్టారు. వీరి మధ్య కొనసాగుతున్న వివాదాల మధ్య వారి 9ఏళ్ల కుమారుడు నలిగిపోతున్నాడు.

ప్రసన్న శంకర్​- దివ్య రిలేషన్​లో అనిశ్చితి..

చెన్నైకి చెందిన ప్రసన్న శంకర్​.. శాన్​ ఫ్రాన్సిస్కోకు చెందిన రిప్లింగ్​ అనే 10బిలియన్​ డాలర్ల హెచ్​ఆర్​ టెక్​ కంపెనీకి ఫౌండర్​. తిరుచిరాపల్లిలోని నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో (ఎన్ఐటీ తిరుచ్చి) విద్యార్థులుగా ఉన్నప్పుడు ప్రసన్న శంకర్, దివ్య శశిధర్ కలుసుకున్నారు. వీరికి 10 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇప్పుడు 9 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. అతని సంరక్షణ వారి బహిరంగ పోరాటానికి కేంద్ర బిందువుగా ఉంది.

ప్రసన్న శంకర్ తన భార్య దివ్యపై చేసిన 5 ఆరోపణలు ఇవి..

అనూప్ అనే వ్యక్తితో తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని శంకర్ తన ఎక్స్ అకౌంట్​లో ఆరోపించాడు. ఆరు నెలలకు పైగా ఈ వ్యవహారం సాగిందని, అతనికి దివ్యకు మధ్య జరిగిన సంభాషణల స్క్రీన్ షాట్లను అనూప్ భార్య తనకు పంపడంతో ఈ వ్యవహారం గురించి తెలిసిందని టెక్ ఎంటర్​ప్రెన్యూర్ పేర్కొన్నారు.

"నాకు, నా భార్య దివ్యకు పెళ్లై పదేళ్లు కాగా, మాకు 9 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అనూప్ అనే వ్యక్తితో 6 నెలలకుపైగా ఆమె ఎఫైర్ పెట్టుకుందని నేను తెలుసుకున్న తరువాత ఇటీవల మా వైవాహిక బంధం విచ్ఛిన్నమైంది," అని అనూప్ భార్య నుంచి తనకు వచ్చిన స్క్రీన్​షాట్లను ఎక్స్​లో పంచుకున్నారు.

తన భార్య తనపై గృహ హింస, అత్యాచారం సహా వరుస తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. విడాకుల సెటిల్​మెంట్​పై అసంతృప్తితోనే దివ్య ఈ తప్పుడు ఆరోపణలు చేసిందని ఆయన చెప్పారు.

ఆ తర్వాత విడాకుల్లో భాగంగా ఆమెకు ఎన్ని మిలియన్ డాలర్లు చెల్లించాలనే విషయంపై చర్చలు జరిపాం. దీంతో ఆమె అసంతృప్తికి గురై నేను కొట్టానని నాపై పోలీసులకు తప్పుడు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది," అని రాసుకొచ్చారు.

సింగపూర్​కు చెందిన ఈ సాఫ్ట్​వేర్​ కంపెనీ వ్యవస్థాపకుడు తన భార్య తనపై తప్పుడు అత్యాచారం కేసు పెట్టిందని ఆరోపించారు. తన న్యూడ్​ ఫొటోలను సర్క్యులేట్​ చేశానన్న దివ్య ఆరోపణల్లో కూడా నిజం లేదని వివరించారు.

"సింగపూర్ పోలీసులు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేశారు. అవి నిరాధారమైనవని కనుగొన్నారు. నన్ను అన్ని అభియోగాల నుంచి విముక్తి చేశారు," అని ఆయన ఎక్స్​లో రాశారు.

తమ తొమ్మిదేళ్ల కుమారుడిని దివ్య కిడ్నాప్ చేసిందని ప్రసన్న శంకర్ ఆరోపించారు. తన నుంచి పెద్ద సెటిల్​మెంట్ కోసం దివ్య భారత్​లో కాకుండా అమెరికాలో విడాకుల కేసు వేసిందని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత తన కుమారుడిని అపహరించి అమెరికాకు తీసుకెళ్లిందని వివరించారు.

'నేను అమెరికాలో అంతర్జాతీయ బాలల అపహరణ కేసు పెట్టాను. జడ్జి నాకు అనుకూలంగా తీర్పునిచ్చి బిడ్డను తిరిగి ఇవ్వాలని చెప్పారు," అని ప్రసన్న శంకర్​ చెప్పారు.

Sharath Chitturi

TwittereMail
శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.